రెండు రోజుల క్రితం దర్శకుడు గుణశేఖర్ ‘హిరణ్యకశ్యప’ చిత్రం క్యాన్సిల్ చేసుకున్నాడు.రానా ప్రాజెక్ట్ను పక్కకు పెట్టి ప్రస్తుతం రెండు వెబ్ సిరీస్లను ప్లాన్ చేస్తున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.
కాని హిరణ్య కశ్యప చిత్రంను పక్కకు పెట్టిన విషయం నిజం కాదని ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయ్యింది.
త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తాం అన్నట్లుగా గుణశేఖర్ ప్రకటించాడు.
నిప్పు లేనిదే పొగ రాదు అంటారు.
గుణశేఖర్ వెబ్ సిరీస్ల గురించి ఆలోచించకుండానే ఆయన వెబ్ సిరీస్లు చేయబోతున్నాడు అనే వార్త వచ్చి ఉండదు.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హిరణ్య కశ్యప చిత్రం కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
అందుకే ఆ గ్యాప్లో రెండు వెబ్ సిరీస్లను సొంత నిర్మాణ సంస్థలో పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నాడు.తన రెగ్యులర్ పంథాలో కాకుండా మీడియం బడ్జెట్లో ఈ వెబ్ సిరీస్లను పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడు.
గుణశేఖర్ వచ్చే ఏడాది సమ్మర్ వరకు రెండు వెబ్ సిరీస్లను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి ఆ తర్వాత అంటే జూన్ లేదా జులై నుండి హిరణ్య కశ్యప చిత్రంను ప్రారంభించబోతున్నాడు.2022 చివర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ఆశపడుతున్నాడు.ఒక వేళ 2022లో కాకున్నా కాస్త ఆలస్యంగా అంటే 2023లో అయినా హిరణ్య కశ్యప ప్రేక్షకుల ముందుకు వస్తుందనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు.