స్టోరీ రైటర్ గా కెరీర్ మొదలు పెట్టి డైరక్టర్ గా కూడా సక్సెస్ అయిన వారిలో దశరధ్ ఒకరు.ఆయన అంతకుముందు కథలు అందించి తర్వాత సినిమాలు డైరెక్ట్ చేశారు.
శౌర్య తర్వాత సినిమాలు తీయడం ఆపేసిన దశరధ్ లేటెస్ట్ గా ఒక సినిమా మొదలు పెట్టారు.అంతా కొత్త వారితో చేస్తున్న ఈ సినిమాను దశరధ్ డైరెక్ట్ చేయడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది.
దశరధ్ తో పాటుగా డివై చౌదరి కూడా ఈ మూవీని నిర్మిస్తున్నారని తెలుస్తుంది.
ఈ మూవీకి టైటిల్ గా లవ్ యు రామ్ అని ఫిక్స్ చేశారు.
రోహిత్ బెహల్, అపర్ణ జనార్ధనన్ లీడ్ రోల్స్ గా నటిస్తున్న ఈ మూవీ ఒక లవ్ స్టోరీగా వస్తుందట.చాలాకాలం తర్వాత దశరధ్ తను రాసుకుని డైరెక్ట్ చేస్తున్న సినిమాగా ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు ఉన్నాయి.
ప్రభాస్, నాగార్జున లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసిన దశరధ్ ఇలా సినిమాలు లేకుండా ఖాళీగా ఉండటం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.మరి దశరధ్ ఈ మూవీని ఎలా తీస్తున్నారో చూడాలి.
సినిమాని తన స్టైల్ ఆఫ్ మేకింగ్ తో దశరథ్ తెరకెక్కిస్తున్నారట.ఈ మూవీతో ఆయన తిరిగి ఫాం లోకి రావాలని చూస్తున్నారు.