టాలీవుడ్ నుంచి బాలీవుడ్ లోకి వెళ్ళిన తర్వాత పంజాబీ బ్యూటీ తాప్సి పొన్ను మంచి సక్సెస్ ఫుల్ సినిమాలతో దూసుకుపోతుంది.వచ్చిన అవకాశాలని వినియోగించుకుంటూ ఫిమేల్ సెంట్రిక్ కథలకి కేరాఫ్ గా మారిపోయింది.
అలాగే వరుసగా బయోపిక్ కథలకి కూడా తాప్సి ఒకే చెబుతుంది.కమర్షియల్ ఫార్మాట్ కథలపై శ్రద్ధ చూపించకుండా తన పాత్ర ప్రాధాన్యత చూసుకుంటూ సినిమాలని ఎంపిక చేసుకుంటుంది.
ఈ నేపధ్యంలో బాలీవుడ్ లో వరుస సక్సెస్ లని తాప్సి అందుకుంటుంది.ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆమె నటించిన మూడు సినిమాలు ఒటీటీలో రిలీజ్ కావడానికి రెడీ అవుతున్నాయి.
మరో వైపు హైదరాబాదీ విమెన్ స్టార్ క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ లో తాప్సి ప్రస్తుతం నటిస్తుంది. ఈ సినిమా కోసం క్రికెట్ కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయ్యి ప్రత్యేకంగా క్రికెట్ శిక్షణ కూడా తీసుకుంది.
అలాగే మిథాలి రాజ్ శైలిని కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. వాయ్ కామ్ 18 స్టూడియోస్ ఈ మూవీని నిర్మిస్తుంది.ఇక ఎప్పుడో కన్ఫర్మ్ అయిన ఈ ప్రాజెక్ట్ తాప్సి క్రికెట్ ప్రాక్టీస్ కారణంగా ఆలస్యం అవుతుంది.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకి దర్శకత్వం వహించాల్సిన రాహుల్ డోలాఖియా తప్పుకున్నట్లు తెలుస్తుంది.
అయితే అతను ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడా, లేదంటే తప్పించేసారా అనే విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు.కాని అతని స్థానంలోకి శ్రీజిత్ ముఖర్జీ వచ్చారు.
ఈయన దర్శకత్వంలో జులై, ఆగష్టులో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.శభాష్ మిథు టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కనున్న సంగతి అందరికి తెలిసిందే.