మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా వచ్చిన మొదటి సినిమా ఉప్పెన.మొదటి సినిమాతోనే ఉప్పెన సృష్టించాడు వైష్ణవ్ తేజ్.ఈ సినిమాను బుచ్చిబాబు సాన డైరెక్ట్ చేసాడు.దర్శకుడిగా ఇతనికి కూడా మొదటి సినిమానే.సుకుమార్ శిష్యుడిగా బుచ్చిబాబు తన టాలెంట్ ను నిరూపించుకున్నాడు.ఈ సినిమాతో బుచ్చిబాబు పేరు ఇండస్ట్రీలో మారుమోగి పోయింది.
అంత సంచలనం సృష్టించింది ఉప్పెన సినిమా.బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.అంతేకాదు ఈ సినిమా 50 కోట్ల క్లబ్ లోకి కూడా అడుగు పెట్టింది.ఈ సినిమాను నిర్మించిన మైత్రి మూవీస్, సుకుమార్ రైటింగ్స్ కు భారీ లాభాలను తెచ్చిపెట్టింది.
ఈ సినిమాతో బుచ్చిబాబుకు వరస ఆఫర్లు వస్తున్నాయి.తన రెండవ సినిమా కూడా బుచ్చిబాబు మైత్రి మూవీస్ వారితోనే చేయడానికి రెడీ అయ్యాడు.
బుచ్చిబాబు రెండవ సినిమాను ఎన్టీఆర్ తో చేయబోతున్నట్టు తెలుస్తుంది.ఇప్పటికే ఎన్టీఆర్ ను కలిసిన బుచ్చిబాబు స్టోరీ లైన్ కూడా వినిపించాడు.ఈ స్టోరీ లైన్ విని ఎన్టీఆర్ సినిమా చేయడానికి అంగీకరించినట్టు సమాచారం.ప్రస్తుతం బుచ్చిబాబు ఫైనల్ స్క్రిప్ట్ రెడీ చేస్తూ బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది.అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు.
ఈ సినిమా పూర్తి అయిన తర్వాతే ఎన్టీఆర్ మరొక సినిమా మొదలు పెట్టే ఛాన్స్ ఉంది.
ఈ లోపు బుచ్చిబాబు పూర్తి కథ రెడీ చేసుకోబోతున్నాడు.అయితే ఈ సినిమా కోసం బుచ్చిబాబు తీసుకోబోయే రెమ్యునరేషన్ గురించి ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది.
మైత్రి మూవీస్ వారు ఈ సినిమా కోసం బుచ్చిబాబు కు 10 కోట్ల వరకు ముట్టచెబుతున్నారని సమాచారం.రెండవ సినిమాకే ఇంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని అందరూ షాక్ అవుతున్నారు.