ఎన్టీఆర్తో ‘జై లవకుశ’ చిత్రాన్ని చేసిన దర్శకుడు బాబీ తాజాగా ‘వెంకీమామ’ చిత్రంతో రెడీ అయ్యాడు.జైలవకుశ చిత్రం యావరేజ్గానే ఆడింది.
అయినా కూడా వెంకీమామ చిత్రంకు భారీ హైప్ ఉంది.తప్పకుండా ఈ సినిమా ఆకట్టుకుంటుందనే నమ్మకం అందరిలో వ్యక్తం అవుతుంది.
ఈ సందర్బంగా దర్శకుడు బాబీ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఆయన తదుపురి చిత్రాలపై ఒక క్లారిటీ ఇచ్చేశాడు.
జైలవకుశ చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న దర్శకుడు బాబీ తదుపరి చిత్రం విషయంలో అలా జరగకుండా చూసుకుంటానంటూ చెబుతున్నాడు.వచ్చే ఏడాదిలో ఖచ్చితంగా తన కొత్త సినిమాను విడుదల చేస్తానంటూ చెబుతున్నాడు.ఇప్పటికే కథ సిద్దంగా ఉందని, తప్పకుండా సినిమాను త్వరలోనే చేయబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు.అతి త్వరలోనే ఈ విషయమై క్లారిటీ ఇస్తానంటూ ఆయన ప్రకటించాడు.
తనకు అల్లు అర్జున్ను డైరెక్ట్ చేయాలనే కోరిక చాలా ఉందని, తప్పకుండా బన్నీకి కథ నచ్చే విధంగా ఒక స్క్రిప్ట్ను తీసుకు వెళ్లాలని భావిస్తున్నాను అన్నాడు.అయితే దానికి ఇంకాస్త సమయం కావాలంటూ చెప్పుకొచ్చాడు.వచ్చే ఏడాది సినిమా చేసిన తర్వాత బన్నీ కోసం కథను సిద్దం చేసే పనిలో పడతానంటూ ఈ సందర్బంగా బాబీ చెప్పుకొచ్చాడు.మరి భవిష్యత్తులో బాబీ అల్లు అర్జున్ను డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకుంటాడా చూడాలి.
.