మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని ప్రతి దర్శకుడు కలలు కంటూ ఉంటాడు.అయితే అతి కొద్ది మందికి మాత్రమే ఆ అవకాశం వస్తుంది.
కథల జడ్జిమెంట్ విషయంలో పెర్ఫెక్ట్ గా ఉండే చిరంజీవి తన సినిమా విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటాడు.కమర్షియల్ అంశాలు పక్కాగా ఉంటేనే కథని ఒకే చేస్తాడు.
అదే సమయంలో కమర్షియల్ తో పాటు కంటెంట్ లో మెసేజ్ కూడా ఈ మధ్య చూస్తున్నాడు.ఈ నేపధ్యంలో కొరటాల శివ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సెట్స్ పైకి తీసుకెళ్ళాడు.
అయితే తరువాత మలయాళీ హిట్ మూవీ లూసీఫర్ ని తెలుగులో రీమేక్ చేస్తాడని టాక్ వినిపిస్తుంది.ఇదిలా ఉంటే ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తుంది.
బలుపు సినిమాతో దర్శకుడు ఎంట్రీ ఇచ్చిన బాబి రెండో సినిమానే పవన్ కళ్యాణ్ తో చేసే అవకాశం సొంతం చేసుకున్నాడు.సర్దార్ గబ్బర్ సింగ్ గా వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.
అయితే తరువాత ఎన్టీఆర్ తో జై లవకుశ అనే సినిమా చేసి సూపర్ హిట్ కొట్టాడు.మరల తాజాగా వెంకీ మామ అంటూ వెంకటేష్, చైతూ తో మల్టీ స్టారర్ సినిమా తీసి మరో హిట్ ని తన ఖాతాలో వేసుకొని ట్రాక్ లోకి వచ్చాడు.
ఈ కుర్ర దర్శకుడుగా రీసెంట్ గా మంచి ఎంటర్టైన్మెంట్ స్టొరీ లైన్ లో చిరంజీవికి వినిపించడం జరిగిందని, దానికి అతను కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందని తెలుస్తుంది.బౌండ్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకొని వస్తే చేద్దామని చిరంజీవి అతనికి మాట ఇచ్చినట్లు టాక్.
ఇక ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తుంది.ఆచార్య పూర్తయ్యే నాటికి బాబి స్క్రిప్ట్ సిద్ధం చేస్తే దానినే చిరు సెట్స్ పైకి తీసుకెళ్ళే అవకాశం ఉందని టాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు.