తమిళ సినీ దర్శకుడు భారతీ రాజా సంచలన నిర్ణయం తీసుకున్నారు.ప్రస్తుతం ఉన్న నిర్మాతల మండలి అసోసియేషన్ కు వ్యతిరేకంగా కొత్తగా మరో అసోసియేషన్ ను ఫామ్ చేసినట్లు తెలుస్తుంది.
గత కొంత కాలంగా నిర్మాతల మండలి అధ్యక్షుడు,నటుడు విశాల్ తో అసోసియేషన్ పరంగా విభేదాలు ఎదురైనా విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో విశాల్ ను టార్గెట్ చేస్తూ భారతీ రాజా ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ప్రస్తుత నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఉన్న విశాల్ దాదాపు రూ.7 కోట్ల మేరకు అసోసియేషన్ డబ్బుల విషయంలో అవినీతికి పాల్పడినట్లు ఆయన ఆరోపిస్తున్నారు.ఇలా కొత్త అసోసియేషన్ ను ఫామ్ చేసి కొంతమంది మంచి నిర్మాతలను కాపాడే ప్రయత్నమే అని దీనికి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలి అంటూ భారతీ రాజా విజ్ఞప్తి చేశారు.ప్రస్తుతం ఉన్న నిర్మాతల మండలి మంచి నిర్మాతలకు ఎలాంటి మంచి జరగడం లేదని, మంచి వారిని టార్గెట్ చేస్తూ నిలువునా దోచుకుంటున్నారు అంటూ భారతీరాజా ఆరోపించారు.
ప్రస్తుతం ఉన్న నిర్మాతల మండలికి వ్యతిరేకంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కొంచం బాధగానే ఉన్నప్పటికీ కొంతమంది నుంచి మంచివారిని కాపాడే ప్రయత్నమే ఈ కొత్త అసోసియేషన్ ఏర్పాటు అంటూ భారతీ రాజా స్పష్టం చేశారు.
నిర్మాతల మండలి లో సభ్యులుగా ఉన్న భారతీ రాజా కు అలానే అసోసియేషన్ అధ్యక్షుడు విశాల్ కు గత కొద్దీ రోజులుగా విభేదాలు ఏర్పడిన విషయం తెలిసిందే.
గతంలో కూడా ఈ విభేదాల కారణంగా బహిరంగంగానే ఒకరినొకరు ఆరోపణలు కూడా చేసుకున్నారు.ఇప్పుడు తాజాగా దర్శకుడు భారతీ రాజా ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.