మా దర్శకుడికి పాల్కే ఇవ్వండంటూ ఆ 38 మంది లేఖ

ఇండియన్‌ సినిమా అత్యున్నత అవార్డు దాదా సాహెబ్‌పాల్కేను తమిళ దర్శకుడు భారతీరాజాకు ఇవ్వాల్సిందిగా స్టార్స్‌ 38 మంది కేంద్ర సమాచార శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు.జాతీయ అవార్డు సాధించిన ఆ 38 మంది కూడా భారతీరాజా వంటి గొప్ప దర్శకుడికి ఈ ఏడాదికి గాను పాల్కే అవార్డు ఇవ్వాలని, ఆయన సినిమా ఇండస్ట్రీకి చేసిన సేవకు గాను ఆయన్ను గుర్తించాల్సిన అవసరం ఉందంటూ ఆ లేఖలో పేర్కొన్నారు.

 Indian Cinema, Dadasaheb Phalke Award, Director Bharathiraja, Padma Shri Award,-TeluguStop.com

భారతీరాజా కు పాల్కే అవార్డు విజ్ఞప్తి చేస్తూ లేఖ రాసిన వారిలో కమల్‌ హాసన్‌, ధనుష్‌, బాలా, సుహాసిని, మణిరత్నం, సముద్రఖని ఇంకా కొందరు ఉన్నారు.ఆయన చేసిన సినిమాలు తెలుగు, తమిళం, హిందీల్లో బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్స్‌గా నిలిచాయి.

దాంతో పాటు ఆయన సినిమా పరిశ్రమలో మార్పుకు ఎంతో తోడ్పాటు అందించారు.యువతను ఎంకరేజ్‌ చేస్తూ ఆయన చేసిన సినిమాలు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాయి.

అందుకే ఆయనకు ఈసారి అవార్డు ఇవ్వాలంటూ అంతా విజ్ఞప్తి చేశారు.

ఇప్పటికే పద్మశ్రీ అవార్డును అందుకున్న భారతీరాజా ఈసారి పాల్కే అవార్డును అందుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అంటూ తమిళ మీడియా వర్గాల వారు ప్రముఖంగా చర్చించుకుంటున్నారు.

అయితే భారతీరాజా సినిమాల సంఖ్య 42 ఉండటం కాస్త ఆలోచించాల్సిన విషయం.అయితే ఆ 42 చిత్రాల్లో 6 చిత్రాు జాతీయ స్థాయిలో అవార్డును దక్కించుకోవడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube