ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసుల్లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసు ఒకటి.తీగ లాగితే డొంకంతా కదిలినట్లు సుశాంత్ సింగ్ మృతి కేసులో ఎన్నో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
చనిపోయే చివరి నిమిషం వరకు క్లీన్ ఇమేజ్ ఉన్న సుశాంత్ పై తీవ్రస్థాయిలో ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.ఇప్పటికే సుశాంత్ డ్రగ్స్ తీసుకునేవాడని తేలగా తాజాగా ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాఫిక్ గా మారాయి.
దర్శకుడు అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ కొన్ని కారణాల వల్ల తాను సుశాంత్ తో సినిమా చేయలేదని తెలిపారు.సుశాంత్ సమస్యాత్మక వ్యక్తంటూ అనురాగ్ కశ్యప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఒక నెటిజెన్ అనురాగ్ కశ్యప్ ను సుశాంత్ ఆత్మహత్యకు పరోక్షంగా బాలీవుడ్ ఇండస్ట్రీనే కారణమని… గత కొన్ని సంవత్సరాలుగా సుశాంత్ ను బాలీవుడ్ పట్టించుకోలేదంటూ కామెంట్లు చేస్తూ ప్రశ్నించాడు.
ఆ ప్రశ్నకు సమాధానంగా అనురాగ్ కశ్యప్ కొన్ని వాట్సాప్ చాట్ లను అతనికి షేర్ చేశాడు.
సుశాంత్ చనిపోవడానికి కొన్ని వారాల ముందు అతని మేనేజర్ తో తాను చాట్ చేసిన స్క్రీన్ షాట్ లను షేర్ చేశానని తెలిపాడు.ఆ చాట్ లో సుశాంత్ మేనేజర్ అనురాగ్ సినిమాల్లో సుశాంత్ కు తగిన పాత్ర ఏదైనా ఉంటే ఇవ్వాలని సూచించాడు.
ఆ ప్రశ్నకు అనురాగ్ కశ్యప్ బదులిస్తూ తనకు సుశాంత్ ఎప్పటినుంచో తెలుసని… అతను సమస్యాత్మక వ్యక్తి కావడం వల్లే అవకాశాలు ఇవ్వడం లేదని అన్నారు
సుశాంత్ తో తాను పని చేయకూడదని అనుకోవడానికి తనకు కొన్ని వ్యక్తిగతమైన కారణాలు ఉన్నాయని అనురాగ్ కశ్యప్ పేర్కొన్నారు.వాట్సాప్ చాట్ ను పూర్తిగా చదివిన తరువాత ఇష్టం వచ్చిన విధంగా కామెంట్ చేయవచ్చని నెటిజన్ కు అనురాగ్ కశ్యప్ సూచించారు.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది.