మొదటి సినిమా పిట్టగోడ ఎవరికి తెలియకపోయినా జాతిరత్నాలు సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు డైరక్టర్ అనుదీప్ కెవి.నాగ్ అశ్విన్ ఇచ్చిన ఛాన్స్ ని పర్ఫెక్ట్ గా వాడుకున్న అనుదీప్ ఒక్క సినిమాతో స్టార్ రేంజ్ కి వెళ్లాడు.
ఇక లేటెస్ట్ గా అతని కథతో తన అసిస్టెంట్ వంశీ డైరక్షన్ లో ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా వచ్చింది.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసమే సినిమా అన్నట్టుగా సినిమా టాక్ వచ్చింది.
అయితే జాతిరత్నాలు రేంజ్ ఇది లేదని కూడా అంటున్నారు.
ఇక ఈ సినిమాలో డైరక్టర్ వంశీ కూడా నటించగా ఓ చిన్న పాత్రలో జాతిరత్నాలు డైరక్టర్ అనుదీప్ కూడా మెరిశాడు.
అసలు ఈ సినిమాకు ఖుషి అన్న టైటిల్ ఎందుకు పెట్టారు అని వంశీని ఓ పాత్ర అడుగుతుంది.అన్ని అందరికి తెలియదు.కొంతమందికే అలా తెలుస్తుంది.నా ఫ్రెండ్ ఒకరు అలా అన్ని తెలిసిన వాడు ఉన్నాడు.
అతని పేరు సంఘమేష్ అంటూ పిలుస్తాడు.కట్ చేస్తే స్టార్ హీరో రేంజ్ మాదిరి డైరక్టర్ అనుదీప్ ఎంట్రీ ఉంటుంది.
సినిమాలో దీన్ని ఆడియెన్స్ బాగానే ఎంజాయ్ చేసి ఉండొచ్చని చెప్పొచ్చు.మొత్తానికి అనుదీప్ తన కథతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు.