టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలను సొంతం చేసుకున్న డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకరు.పటాస్ నుంచి సరిలేరు నీకెవ్వరు సినిమా వరకు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అనే సంగతి తెలిసిందే.
గతేడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో మహేష్ బాబుకు కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ గా ఎఫ్3 సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఎఫ్ 2 సినిమాలో నటించిన వాళ్లే ఎఫ్ 3 సినిమాలో కూడా నటిస్తుండటం గమనార్హం.
టాలీవుడ్ లో సీక్వెల్ సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోయినా అనిల్ రావిపూడి ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తాడని అనిల్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఇకపోతే ఈ టాలీవుడ్ డైరెక్టర్ ఖరీదైన బంగ్లాను కొనుగోలు చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఈ బంగ్లా కోసం అనిల్ ఏకంగా 12 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
త్వరలో అనిల్ రావిపూడి తన కుటుంబంతో కలిసి ఖరీదైన బంగ్లాలోకి ప్రవేశించనున్నాడని హైదరాబాద్ శివార్లలో ఈ బంగ్లా ఉందని కథనాలు వస్తున్నాయి.అయితే అనిల్ రావిపూడి స్పందిస్తే మాత్రమే బంగ్లా విషయంలో వాస్తవాలు తెలిసే అవకాశం ఉంటుంది.మరోవైపు అనిల్ రావిపూడి స్క్రీన్ ప్లే అందించిన గాలిసంపత్ ఈ నెల 11న విడుదల కానుంది.
ఈ సినిమాలో శ్రీవిష్ణు, రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
గాలి సంపత్ సినిమాకు అనిల్ రావిపూడి సమర్పకుడిగా వ్యవహరిస్తుండగా ఈ సినిమాకు పోటీగా జాతిరత్నాలు, శ్రీకారం సినిమాలు విడుదలవుతున్నాయి.
మరోవైపు ఎఫ్ 3 సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతుండగా ఈ ఏడాది ఆగష్టు 27న ఈ సినిమా విడుదల కానుంది.భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం.