స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పని చేసి రణం సినిమాతో డైరెక్టర్ గా కూడా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు అమ్మ రాజశేఖర్.అయితే రణం మినహా అమ్మ రాజశేఖర్ దర్శకునిగా తెరకెక్కించిన సినిమాలేవీ ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు.
కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న అమ్మ రాజశేఖర్ కు బిగ్ బాస్ సీజన్ 4లో ఛాన్స్ రాగా 9వ వారం ఆయన హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు.
బిగ్ బాస్ సీజన్ 4 గ్రాంఢ్ ఫినాలేకు గెస్ట్ గా హాజరైన చిరంజీవి అమ్మ రాజశేఖర్ గురించి మాటాడుతూ అమ్మ రాజశేఖర్ రణం సినిమాతో దర్శకునిగా పరిచయం కాకముందే అతనికి తాను 15 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చానని.
కానీ అమ్మ రాజశేఖర్ ఇప్పటివరకు తనతో సినిమా మాత్రం తెరకెక్కించలేదని అన్నారు.తాజాగా అమ్మ రాజశేఖర్ ఒక ఇంటర్వ్యూలో ఆ అడ్వాన్స్ గురించి స్పందిస్తూ చిరంజీవి కోసం తాను గబ్బర్ సింగ్ లాంటి కథను చేశానని అన్నారు.
చిరంజీవి ఛాన్స్ ఇస్తే ఆ కథను తెరకెక్కించడానికి దర్శకునిగా తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.ప్రస్తుతం ఆచార్య సినిమాలో హీరోగా నటిస్తున్న చిరంజీవి లూసీఫర్, వేదాళం రీమేక్ లలో నటించబోతున్న సంగతి తెలిసిందే.
చిరంజీవి రీమేక్ సినిమాలలో నటించడం గురించి అమ్మ రాజశేఖర్ స్పందిస్తూ స్టార్ హీరోగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి రీమేక్ సినిమాల్లో నటించడం వల్ల పెద్దగా లాభం ఉండదని అన్నారు.
రీమేక్ సినిమాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి చిరంజీవి తప్పు చేస్తున్నారని తనకు అనిపిస్తోందని.
చిరంజీవి రేంజ్ కు ఒరిజినల్ కథల్లో నటిస్తేనే బాగుంటుందని అమ్మ రాజశేఖర్ అన్నారు.ఓటీటీల వల్ల ప్రేక్షకులు ఇతర భాషల సినిమాలను కూడా చూస్తున్నారని.రీమేక్ సినిమాలు సక్సెస్ అయ్యే అవకాశాలు తక్కువ కాబట్టి చిరంజీవి ఒరిజినల్ కథల్లోనే నటిస్తే బాగుంటుందని అమ్మ రాజశేఖర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.