ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంచారు.రాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్ కు జంటగా పూజ హెగ్డే నటిస్తున్నారు.
ఈ సినిమాను జులై 30 న విడుదల చేయబోతున్నారు.ఆ తర్వాత వెంటనే గ్యాప్ లేకుండా రెండు సినిమాలు ఒకేసారి షూటింగ్ చేస్తూ బిజీగా ఉన్నాడు.
ప్రభాస్ బాహుబలి చిత్రంతో తన స్టామినాను ఒక్కసారిగా పెంచుకున్నాడు.ఈ సినిమా తర్వాత తన మార్కెట్ కూడా అమాంతం పెరిగింది.
అందుకే వరస పెట్టి అన్ని పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు.
ప్రభాస్ సలార్, ఆది పురుష్ సినిమాలు ప్రకటించి ఇప్పటికే షూటింగ్ కూడా ప్రారంభించేసారు.
సలార్ సినిమాను కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు.ప్రశాంత్ నీల్ ఈ సినిమాను ఉగ్రం సినిమాకు రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుంది.ఈ సినిమాతో పాటు ఆదిపురుష్ సినిమా షూటింగ్ కూడా ఒకేసారి కంప్లీట్ చేస్తున్నాడు.
ఆదిపురుష్ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటిస్తున్నారు.ప్రస్తుతం ప్రభాస్ ముంబైలో జరుగుతున్న ఆదిపురుష్ షూటింగ్ లో పాల్గొన్నాడు.
ఈ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుంది.
ఈ సినిమాను బెస్ట్ విజువల్ గ్రాఫిక్స్ తో తెరకెక్కిస్తున్నారు.
ఇందుకోసం భారీగానే ఖర్చు చేస్తున్నారని టాక్.అయితే ఈ సినిమా షూటింగ్ లో జరిగే విషయాలను డైరెక్టర్ ఓం రౌత్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
ఈ సినిమా సెట్ లో షూట్ జరుగుతున్నంత సేపు చాలా పాజిటివ్ గా ఉంటుందని ఆయన తెలిపాడు.అంతేకాదు ఈ సెట్ లో పని చేసే అందరికి ఎనర్జిటిక్ గా అనిపిస్తుంది అని వివరించాడు.
దీంతో ఇప్పుడు ఈ విషయంపై స్కిల్ మీడియాలో రచ్చ జరుగుతుంది.ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే సంవత్సరం ఆగస్టు 11 న విడుదల చేయాలనీ అనుకుంటున్నారు.