గద్దలకొండ గణేష్ సినిమాలో ఐటెం సాంగ్ తో అందరి దృష్టిని ఆకర్షించిన తెలుగు బ్యూటీ డింపుల్ హయాతి.ముంబై భామల తరహాలో గ్లామర్ ఫోటో షూట్ లతో తాను ఎలాంటి పాత్రలకైన సిద్ధం అని ఈ అమ్మడు కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచే దర్శక, నిర్మాతలకి హిట్ ఇస్తూ వచ్చింది.
గల్ఫ్ అనే సినిమాతో హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసిన అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది.తరువాత రెండు చిన్న సినిమాలు చేసిన ఎవరూ పట్టించుకోలేదు.
అయితే గద్దలకొండ గణేష్ సినిమాలో ఐటెం సాంగ్ తో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది.ఆ తర్వాత హీరోయిన్ గా మరింత విస్తృతంగా ప్రయత్నాలు చేయడంతో ఊహించని విధంగా రవితేజకి జోడీగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఖిలాడీ మూవీలో అవకాశం దక్కించుకుంది.
ఈ సినిమాతో తన కెరియర్ టర్న్ అవుతుందనే ఆశతో డింపుల్ ఉంది.అయితే ఈమె కెరియర్ లో మరింత బూస్ట్ ఇచ్చే విధంగా ఇప్పుడు కోలీవుడ్ లో క్రేజీ ఆఫర్ ని సొంతం చేసుకుంది.
స్టార్ హీరో విశాల్ కి జోడీగా అతని కొత్త సినిమాలో నటించబోతుంది.విశాల్ హీరోగా టి.పి.శర్వానంద్ దర్శకత్వంలో కొత్త సినిమా తాజాగా చెన్నైలో ప్రారంభం అయ్యింది.ఈ సినిమాని హోం బ్యానర్ లో విశాల్ నిర్మిస్తున్నాడు.యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.ఇందులో హీరోయిన్ గా డింపుల్ హయాతి కన్ఫర్మ్ అయ్యింది.విశాల 31వ చిత్రంగా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో డిఫరెంట్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కబోతుందని తెలుస్తుంది.
సినిమాని రెండు నెలల్లో పూర్తి చేసి ఆగష్టులో రిలీజ్ చేస్తామని దర్శకుడు శర్వానంద్ ప్రకటించేశారు.కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న ఈ సిమయంలో షూటింగ్ ఎంత వరకు సాధ్యం అవుతుందనేది కొద్దిగా సస్పెన్స్.
ఈ సినిమా వర్క్ అవుట్ అయితే డింపుల్ హయాతి కోలీవుడ్ లో కూడా బిజీ అయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు.