తెలుగులో ఒకప్పుడు ఎన్టీఆర్, ఏయన్నార్ వంటి స్టార్స్ కలిసి నటించడం చాలా కామన్ అయ్యింది.మల్టీస్టారర్ చిత్రాలు అప్పట్లో సంచలనం సృష్టించాయి.
అప్పట్లో స్టార్స్ ఒకరిపై ఒకరికి అభిమానం, గౌరవం ఉండటంతో కలిసి నటించేందుకు ఒప్పుకున్నారు.కాని ఇప్పుడు పరిస్థితి అలా లేదు.
స్టార్ హీరోలు ఎవరు కూడా మరో స్టార్ హీరోతో కలిసి నటించేందుకు ఆసక్తి చూపడం లేదు.ఎవరో గొప్ప దర్శకుడు లేదా నిర్మాత భారీ పారితోషికం ఆఫర్ చేస్తే తప్ప మల్టీస్టారర్ సినిమాలు రావడం లేదు.
ప్రస్తుతం రాజమౌళి మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.అంతటి మల్టీస్టారర్ మళ్లీ సాధ్యం అయ్యేనా అంటూ అంతా అనుకుంటున్నారు.ఇలాంటి సమయంలో దిల్రాజు ఒక మల్టీస్టారర్ మూవీకి రెడీ అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది.తన వద్ద ఉన్న ఒక దర్శకుడు తయారు చేసిన మల్టీస్టారర్ కథను పట్టుకుని ప్రముఖ హీరోల వద్దకు దిల్రాజు వెళ్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ప్రస్తుతం సినిమాలకు సంబంధించి చాలా బిజీగా ఉన్న దిల్రాజు ఈ మల్టీస్టారర్ పై చాలా ఆసక్తిగా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.పెద్ద ఎత్తున సినిమాలు చేస్తున్న హీరోలను ఈ మల్టీస్టారర్ కోసం సంప్రదించేందుకు దిల్రాజు చూస్తున్నాడు.గతంలో ఈయన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చేసిన విషయం తెల్సిందే.దిల్రాజుపై ఉన్న నమ్మకం మరియు గౌరవంతో ఆయన నిర్మాణంలో మల్టీస్టారర్ చేసేందుకు స్టార్ హీరోలు ఓకే చెప్తారా చూడాలి.