కరోనా ఎఫెక్ట్ హీరోలపై, హీరోయిన్స్పై ఉంది కాని కొద్ది మొత్తంలోనే ఉంది.ఈ ఎఫెక్ట్ ఎక్కువగా నిర్మాతలపై ఇంకా సినీ కార్మికులపై ఉంది.
నిర్మాతలు కోట్లు పెట్టుబడి ఉన్నారు.సినిమాలు విడుదల కాకుంటే వాటికి వడ్డీలు వడ్డీలు విపరీతంగా పెరుగుతూనే ఉంటుంది.
అలా నిర్మాతలకు ఇబ్బందులు తప్పవు.నిర్మాత దిల్రాజుకు ఈ సమయంలో దాదాపుగా వంద కోట్ల వరకు నష్టాలు వాట్లిుతున్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.
దిల్రాజు మూడు విధాలుగా ఈ సమయంలో నష్టపోతున్నాడట.ముఖ్యంగా దిల్రాజు ఆధీనంలో దాదాపుగా 300 థియేటర్ల వరకు ఉంటాయట.ఇప్పుడు అవన్ని కూడా మూత పడ్డాయి.వాటికి లీజు కట్టాలి, అలాగే అందులో పని చేసే దాదాపుగా వెయ్యి మందికి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి.ఈ నేపథ్యంలో దిల్రాజుకు భారీగా నష్టం వాటిల్లుతున్నట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.ఇంకా నిర్మాతగా కూడా దిల్రాజు భారీగానే నష్టపోతున్నాడట.
విశ్వసనీయ సమాచారం ప్రకారం దిల్రాజు వి సినిమాకు 40 కోట్లు పెట్టుబడి పెట్టి ఉన్నాడు.ఆ సినిమా గత నెలలోనే విడుదల కావాల్సి ఉంది.కాని కరోనా ఎఫెక్ట్తో సినిమా విడుదల వాయిదా వేశారు.దాంతో 40 కోట్లకు భారీగా వడ్డీ పడుతున్నట్లుగా తెలుస్తోంది.ఇదే సమయంలో మూడు నాలుగు సినిమాల డిస్ట్రిబ్యూషన్ రైట్స్ను దిల్రాజు కొనుగోలు చేశాడు.ఆ సినిమాల విడుదల విషయంలో కూడా ఇప్పుడు సందిగ్దం ఏర్పడినది.
దాంతో అలా కూడా ఈయన నష్టపోతున్నట్లుగా సమాచారం అందుతోంది.