నాని ఎంతగానో అంచనాలు పెట్టుకుని చేసిన ‘వి’ సినిమా నేడు విడుదలై తుస్సుమంది.ఈ చిత్రంకు నాని ఎంతో కష్టపడ్డాడు.
ఇది 25వ సినిమా అవ్వడంతో పాటు నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అవ్వడం వల్ల అందరిలో కూడా ఆసక్తి రేకెత్తింది.నాని ల్యాండ్ మార్క్ సినిమా అవ్వడంతో ఫ్యాన్స్ చాలా ఆసక్తిని పెంచుకున్నారు.
కాని అభిమానుల అంచనాలు తలకిందులు అయ్యాయి.నాని సినిమా మినిమం గ్యారెంటీ అనుకున్న వారికి నిరుత్సాహం తప్పదు.‘వి’ సినిమా కథ మొదట ఇద్దరు హీరోల వద్దకు వెళ్లి చివరకు నాని వద్దకు వచ్చిందట.
దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి చెప్పిన ఈ కథ ఏదో కారణం వల్ల దిల్ రాజుకు బాగా నచ్చిందట.
ఆ కథకు బాగా అడిక్ట్ అయిన దిల్ రాజు ఖచ్చితంగా ఈ సినిమాను నిర్మించాలనే ఉద్దేశ్యంతో అల్లు అర్జున్ వద్దకు పంపించాడట.ఐకాన్ సినిమాకు ముందు నానితో ఈ సినిమా చేస్తే బాగుంటుందని భావించాడట.
ఈ కథ విషయంలో బన్నీ చాలా నిరుత్సాహం వ్యక్తం చేశాడట.అయినా పట్టువదలకుండా మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ వద్దకు కథను తీసుకు వెళ్లారట.
తేజ్ కూడా ప్రస్తుతానికి ఇంతటి ప్రయోగాలు చేయడం నా వల్ల కాదంటూ తేల్చి చెప్పి తప్పుకున్నాడట.చివరకు ఈ కథను మోహనకృష్ణ ఇంద్రగంటి అంటే ఇష్టపడే హీరో నాని వద్దకు తీసుకు వెళ్లగా ఓకే చెప్పాడట.
నాని మొహమాటానికి ఓకే చెప్పాడా లేదంటే ఆయనకు కూడా దిల్రాజు మాదిరిగా కథ బాగా నచ్చిందా అనేది తెలియదు.కాని నాని మాత్రం ‘వి’ సినిమాను చేసి బుక్ అయ్యాడు అంటూ నెటిజన్స్ మరియు సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నాని మళ్లీ ఇలాంటి ప్రయోగాలు చేయకుండా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేస్తే బెటర్ అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.