రెండు సినిమాల మద్య వివాదం లేదా ఇద్దరు స్టార్స్ మద్య గొడవ వచ్చినప్పుడు ఎవరో ఒకరు మద్యవర్థిత్వం చేస్తే తప్ప అది సర్దుబాటు అవ్వదు.తాజాగా గ్యాంగ్ లీడర్ మరియు వాల్మీకి నిర్మాతలు నువ్వా నేనా అన్నట్లుగా ఢీ అంటే ఢీ అనుకున్నారు.
సెప్టెంబర్ 13న తమ రెండు సినిమాలను విడుదల చేసేందుకు ముందుకు వచ్చారు.నష్టం వచ్చినా పర్వాలేదు ఆ రోజునే విడుదల చేస్తామంటూ రెండు సినిమాల నిర్మాతలు కూడా భీష్మించుకు కూర్చోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో దిల్రాజు రంగంలోకి దిగాడు.
రెండు సినిమాల నిర్మాతలతో మాట్లాడి వారిద్దరిని మీడియా ముందుకు తీసుకు వచ్చిన ఘనత దిల్రాజుకు దక్కిందని చెప్పుకోవాలి.గ్యాంగ్ లీడర్ చిత్రం ఇప్పటికే సాహో వల్ల వాయిదా వేయాల్సి వచ్చింది.అందువల్ల ఆ సినిమాను మళ్లీ వాయిదా వేయమనడం కరెక్ట్ కాదు.అందుకే వాల్మీకి చిత్ర నిర్మాతలను ఒప్పించి దిల్రాజు వాయిదా వేయించినట్లుగా సమాచారం అందుతోంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వాల్మీకి సినిమా విడుదల వాయిదా వేయించేందుకు దిల్రాజు బెదిరించాడని కూడా వార్తలు వస్తున్నాయి.
నైజాంతో పాటు ఏపీలో కూడా దిల్రాజుకు మెజార్టీ శాతం థియేటర్లు ఉన్నాయి.ఆయనవి కాకున్నా ఆయన ఎలా అంటే అలా నడుచుకునే బయ్యర్లు ఉన్నారు.అందుకే వాల్మీకి సినిమాకు ఎక్కువ థియేటర్లు రావాలి అంటే ఖచ్చితంగా వాయిదా వేసుకోవాల్సిందే అంటూ సూచించాడు.
దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో వాల్మీకిని వారు వాయిదా వేసి సెప్టెంబర్ 20న విడుదల చేయబోతున్నట్లుగా ఆ వేదిక మీదే మీడియా ముందు చెప్పుకొచ్చారు.వాల్మీకి చిత్రంలో మెగా హీరో వరుణ్ తేజ్ విలన్గా నటించిన విషయం తెల్సిందే.