సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ చిత్రం ‘మహర్షి’కి అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయిందంటూ సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.సినిమాకు నెగటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో కలెక్షన్స్ ఇంకా తక్కువ ఉంటాయని భావించారు.కాని సినిమాకు దిల్రాజు అండ్ టీం చేసిన ప్రమోషన్ బాగా వర్కౌట్ అయ్యింది.175 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ఈ చిత్రం రాబట్టిందని సినీ వర్గాల వారు అంటున్నారు.అయితే దిల్రాజు చెబుతున్న నెంబర్లో ఏదో తేడా కొడుతుంది అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం 90 కోట్లకు కాస్త అటు ఇటుగా ఈ చిత్రం షేర్ కలెక్షన్స్ ఉన్నాయని, కాకుంటే దిల్రాజు అండ్ టీం మాత్రం 100 కోట్లకు దగ్గర అయ్యిందని, వంద కోట్లు సాధించిందని ప్రచారం చేస్తున్నారంటూ టాక్ వినిపిస్తుంది.175 కోట్ల గ్రాస్ అంటూ ప్రకటిస్తున్నారు కాని అధికారికంగా మాత్రం షేర్ కలెక్షన్స్ ఎంతో అనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.భారీ ఎత్తున అంచనాలున్న మహర్షి చిత్రం ఓపెనింగ్స్ భారీగా వచ్చాయి.
లాంగ్ రన్ కలెక్షన్స్ మాత్రం అంతగా రాలేదట.
మహేష్ బాబు 25వ చిత్రం అవ్వడంతో సహజంగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా వచ్చాయి.అయితే అంచనాలకు ఏమాత్రం ఈ చిత్రం అందుకోలేదని మొదటి రోజే టాక్ వచ్చింది.అయితే దిల్రాజు రైతు సీన్స్, వ్యవసాయం అంటూ మాయ చేసే ప్రయత్నం చేశాడు.
ప్రేక్షకుల సంటిమెంట్ పై కొట్టి సక్సెస్ను దక్కించుకున్నాడు.వంద కోట్ల బిజినెస్ చేసిన దిల్రాజు బయ్యర్లకు నష్టాలు మిగిల్చినట్లుగా ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.