టాలీవుడ్ సినీ నిర్మాత దిల్ రాజ్ గురించి అందరికి తెలిసిందే.శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ నిర్మాణ సంస్థను స్థాపించి తన నిర్మాణంతో టాలీవుడ్ సినిమాల్లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు దిల్ రాజ్.
ఎన్నో సినిమాలలో నిర్మాతగా చేసిన దిల్ రాజ్ అదే స్థాయిలో మరిన్ని సినిమాలను పంపిణీ చేసిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే ఆయన మరో స్టార్స్ కాంబినేషన్ లో క్రేజీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఇంతకీ ఆ స్టార్స్ ఎవరంటే.
తెలుగు స్టార్ హీరో ప్రభాస్, కేజిఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.
అవును వీరిద్దరి కాంబినేషన్ లో నిర్మాత దిల్ రాజు ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు.ఇదివరకే ప్రభాస్ నటించిన మున్నా, మిస్టర్ పర్ ఫెక్ట్ సినిమాలలో దిల్ రాజ్ నిర్మాత చేసిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ప్రభాస్ తో మరో సినిమాను ప్లాన్ చేయగా అధికారికంగా ఈ విషయం గురించి ప్రకటించలేదు.
ఇప్పటికే ప్రభాస్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సలార్ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా పై విపరీతమైన క్రేజ్ ఉండగా మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో దిల్ రాజ్ చేయనున్న ప్లాన్ పక్క వర్కవుట్ అవుతుందని తెలుస్తుంది.ఇక ప్రభాస్ మరో వరుస సినిమాలతో బిజీగా ఉండగా అందులో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆదిపురుష్ సినిమాల్లో నటిస్తున్నాడు.
ఇక అంతే కాకుండా రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ బిజీగా ఉండగా ఈ సినిమా జూలై 30న విడుదల కానుంది.మొత్తానికి ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉండటమే కాకుండా మరో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ కాంబినేషన్ లో అవకాశాన్ని అందుకుంటున్నాడు.