పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో రీఎంట్రీ ఇస్తూ చేస్తున్న మూవీ ‘వకీల్ సాబ్’ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు పవన్ రెడీ అవుతున్నాడు.
అయితే ఈ సినిమా ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్కు రెడీ అయ్యింది.కానీ లాక్డౌన్ కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.
అయితే కరోనా వైరస్ ప్రభావం తగ్గిన తరువాతే ఈ సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.కాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో లీక్ అయ్యి వైరల్గా మారిన సంగతి తెలిసిందే.
కోర్టులో లాయర్ పాత్రలో ఉన్న పవన్ ఫోటోను సోషల్ మీడియాలో చూసి చిత్ర యూనిట్ అవాక్కయ్యింది.ఈ ఫోటోను ఎవరు లీక్ చేశారా అనే విషయాన్ని వారు ఆరా తీస్తున్నారు.
కాగా చిత్ర నిర్మాత దిల్ రాజు ఈ ఫోటో లీక్పై చాలా ఆగ్రహంగా ఉన్నారు.ఇప్పటికే లాక్డౌన్ కారణంగా సినిమా రిలీజ్ వాయిదా పడి తాము ఇబ్బంది పడుతుంటే, ఇలా తమ సినిమాకు సంబంధించిన ఫోటోలు లీక్ కావడంతో తాము మరింత నష్టపోతామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో ఈ విషయంపై పోలీసులను ఆశ్రయించాలని, ఫోటోను లీక్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఆయన ఫిర్యాదు చేయాలని ఆలోచిస్తున్నారు.ఇక బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’ను తెలుగులో ‘వకీల్ సాబ్’ చిత్రంగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.