దిల్ రాజు నిర్మించిన ‘వి’ సినిమా అమెజాన్ ద్వారా వచ్చి ప్రేక్షకులను నిరాశ పర్చిన విషయం తెల్సిందే.నాని.
సుధీర్ బాబులు హీరోలుగా నటించిన ఆ సినిమాపై అంచనాలు భారీగా వచ్చాయి.కాని అంచనాలను అందుకోవడంలో నిరాశ పర్చింది.
అమెజాన్ లో విడుదల అవ్వడం వల్ల కూడా మరింతగా నష్టం చేకూరింది అనే అనుమానాలు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు.ఈ సమయంలోనే థియేటర్లు ఓపెన్కు రంగం సిద్దం అయ్యింది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం థియేటర్ల యాజమాన్యాలతో దిల్ రాజు ‘వి’ సినిమా విడుదల విషయమై చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం అందుతోంది.మల్టీ ప్లెక్స్ ల్లో కాకుండా సినిమాను కేవలం థియేటర్ ల్లోనే విడుదల చేయాలని భావిస్తున్నారు.
సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రేక్షకులు వస్తారనే నమ్మకంను దిల్ రాజు వ్యక్తం అవుతున్నాడు.
ఓటీటీ సినిమాలు ఇంకా మాస్ ఆడియన్స్ కు చేరలేదు.కనుక ఖచ్చితంగా సినిమాను సింగిల్ స్క్రీన్ ప్రేక్షకులు ఆధరిస్తారు అనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.
గతంలో థియేటర్ల యాజమాన్యాలు ఓటీటీ లో విడుదల అయిన సినిమాలను థియేటర్లలో విడుదల చేయనిచ్చేది లేదు అన్నారు.అలాగే ఓటీటీలో సినిమాను థియేటర్లలో విడుదల అయిన 50 రోజుల తర్వాతే స్ట్రీమింగ్ చేయాలనే కండీషన్ కూడా పెట్టారు.
ఈ కండీషన్స్ అన్ని కూడా ఉన్న కారణంగా ఓటీటీ మరియు థియేటర్ల మద్య కాస్త సీరియస్ చర్చలు జరుగుతున్నాయి.ఈసమయంలో ఓటీటీలో విడుదల అయిన సినిమాను ఎలా థియేటర్లలో విడుదల చేస్తారు అని కొందరు అంటున్నారు.
అయితే దిల్ రాజు నుండి వస్తున్న ప్రతిపాదన కు చాలా మంది థియేటర్ల యాజమాన్యాలు ఒప్పుకుంటున్నాయని అంటున్నారు.ఎందుకంటే ఈ సమయంలో జనాలను థియేటర్లకు తీసుకు రావడం ముఖ్యం.
కనుక ఖచ్చితంగా ‘వి’ సినిమాను విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు.