ఇది కూడా పోతే ఇక షాలిని పాప సర్దేసుకోవాల్సిందే...

టాలీవుడ్ రౌడీ విజయ దేవరకొండ నటించినటువంటి  అర్జున్ రెడ్డి సినిమా తో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన శాలిని పాండే గురించి మనకు బాగా తెలుసు.ఈ చిత్రంలో  ప్రీతి శెట్టి పాత్రలో నటించిన శాలిని తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

 Dil Raju Shalini Pandey Iddari Lokam Okate-TeluguStop.com

అయితే ఆ తర్వాత వచ్చిన మహానటి చిత్రంలో సుశీల పాత్ర చేసి కొంత మేర ఫర్వాలేదనిపించింది.అయితే ఏమైందో ఏమో గాని మహానటి చిత్రం తర్వాత ఆమెకి హీరోయిన్ గా కాకుండా సెకండ్ హీరోయిన్ గా నటించే పాత్రలే వచ్చాయి.

దానికితోడు ఈమె నటించిన పాత్రలకి ఈ చిత్రంలో పెద్ద ప్రాధాన్యత లేకపోవడంతో మంచి అవకాశాలను ఈ అమ్మడు దక్కించుకోలేక పోయింది.అయితే మధ్యలో నందమూరి కళ్యాణ్ రామ్ తో హీరోయిన్ గా 118 అనే సినిమాలో నటించనా ఆ సినిమా అంతగా ఆడలేదు.

దీంతో ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి.

Telugu Iddarilokam, Latesttelugu, Shalinipandey, Teluguactress-Movie

అయితే తాజాగా రాజ్ తరుణ్ తో కలిసి “ఇద్దరి లోకం ఒకటే” అనే చిత్రంలో షాలిని పాండే నటిస్తోంది.అయితే ప్రస్తుతం ఈమె ఉన్న పరిస్థితుల్లోనే రాజ్ తరుణ్ కూడా ఉన్నాడు.ఇప్పటికే ఈ చిత్రం ట్రైలర్ విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందింది.

దీంతో ఇద్దరూ ఈ చిత్రంపై భారీ ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.ఒకవేళ  బాక్స్ ఆఫీసు వద్ద ఇద్దరి లోకం ఒకటే చిత్రం ఫలితాల్లో ఏ మాత్రం తేడా వచ్చినా శాలిని పాప మూటాముల్లె సర్దుకుని పోవాల్సిందే అంటూ టాలీవుడ్ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే చూడాలి మరి ఈ చిత్రం మంచి హిట్ అయ్యి షాలినికి అవకాశాలు తెస్తుందో లేదో అని. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube