టాలీవుడ్ రౌడీ విజయ దేవరకొండ నటించినటువంటి అర్జున్ రెడ్డి సినిమా తో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన శాలిని పాండే గురించి మనకు బాగా తెలుసు.ఈ చిత్రంలో ప్రీతి శెట్టి పాత్రలో నటించిన శాలిని తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
అయితే ఆ తర్వాత వచ్చిన మహానటి చిత్రంలో సుశీల పాత్ర చేసి కొంత మేర ఫర్వాలేదనిపించింది.అయితే ఏమైందో ఏమో గాని మహానటి చిత్రం తర్వాత ఆమెకి హీరోయిన్ గా కాకుండా సెకండ్ హీరోయిన్ గా నటించే పాత్రలే వచ్చాయి.
దానికితోడు ఈమె నటించిన పాత్రలకి ఈ చిత్రంలో పెద్ద ప్రాధాన్యత లేకపోవడంతో మంచి అవకాశాలను ఈ అమ్మడు దక్కించుకోలేక పోయింది.అయితే మధ్యలో నందమూరి కళ్యాణ్ రామ్ తో హీరోయిన్ గా 118 అనే సినిమాలో నటించనా ఆ సినిమా అంతగా ఆడలేదు.
దీంతో ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి.
అయితే తాజాగా రాజ్ తరుణ్ తో కలిసి “ఇద్దరి లోకం ఒకటే” అనే చిత్రంలో షాలిని పాండే నటిస్తోంది.అయితే ప్రస్తుతం ఈమె ఉన్న పరిస్థితుల్లోనే రాజ్ తరుణ్ కూడా ఉన్నాడు.ఇప్పటికే ఈ చిత్రం ట్రైలర్ విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందింది.
దీంతో ఇద్దరూ ఈ చిత్రంపై భారీ ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.ఒకవేళ బాక్స్ ఆఫీసు వద్ద ఇద్దరి లోకం ఒకటే చిత్రం ఫలితాల్లో ఏ మాత్రం తేడా వచ్చినా శాలిని పాప మూటాముల్లె సర్దుకుని పోవాల్సిందే అంటూ టాలీవుడ్ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే చూడాలి మరి ఈ చిత్రం మంచి హిట్ అయ్యి షాలినికి అవకాశాలు తెస్తుందో లేదో అని.
.