పవన్ కళ్యాణ్ శృతిహాసన్ కాంబినేషన్ లో వేణుశ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా వకీల్ సాబ్ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.నిన్న వకీల్ సాబ్ సినిమా టీజర్ విడుదల కాగా ఈ టీజర్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.18 గంటల్లో యూట్యూబ్ లో ఈ టీజర్ కు 71 లక్షల వ్యూస్ రాగా గత టీజర్ల రికార్డులను ఈ టీజర్ బ్రేక్ చేస్తుందని పవన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఇప్పటివరకు టీజర్ కు 7,40,000 లైక్స్ రాగా 14,000 డిస్ లైక్స్ వచ్చాయి.
వకీల్ సాబ్ సినిమాలో శృతి పవన్ కు జోడీగా కనిపించగా టీజర్ లో మాత్రం శృతిహాసన్ కనిపించలేదు.ఈ సినిమాలో శృతిహాసన్ పాత్ర పరిమితం కాగా నిర్మాత దిల్ రాజు ముందుగా చేసుకున్న ఒప్పందం కంటే శృతిహాసన్ కు 20 లక్షల రూపాయలు తక్కువగా రెమ్యునరేషన్ ఇచ్చారని సమాచారం.
ఇలా శృతిహాసన్ రెమ్యునరేషన్ తగ్గించడానికి ముఖ్యమైన కారణమే ఉంది.ఈ సినిమాలో పవన్ శృతిహాసన్ కాంబినేషన్ లో తెరకెక్కించాల్సిన ఒక పాటను కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ చేశారని సమాచారం.
ఒక పాట లేకుండానే సినిమాను పూర్తి చేసిన నేపథ్యంలో శృతిహాసన్ కు సాధారణంగా ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ కంటే 20 లక్షల రూపాయలు తక్కువగా ఇచ్చారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.మరోవైపు పింక్ మూవీ ఒరిజినల్ వెర్షన్ కు వకీల్ సాబ్ కు భారీగా మార్పులు చేసినట్లు టీజర్ ను చూస్తుంటే అర్థమవుతోంది.దర్శకుడు వేణుశ్రీరామ్ తెలుగు నేటివిటీకి తగినట్లుగా కథలో మార్పులు చేశారు.
టీజర్ లో పవన్ ఎలివేషన్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు.
అయితే టీజర్ లో సినిమా రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించలేదు.ప్రస్తుతం థియేటర్లలో విడుదలైన సినిమాలకు కలెక్షన్లు భారీ మొత్తంలో వస్తున్నాయి.
వకీల్ సాబ్ ఏప్రిల్ లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుండగా చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.