కరోనా లాక్డౌన్ సమయంలో బడా నిర్మాత దిల్ రాజు తన కుటుంబ సభ్యుల సమక్షంలో రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.పెళ్లి తర్వాత ఎక్కువగా భార్యతో గడుపుతూ టెంపుల్స్ దర్శనాలు చేసుకున్న దిల్ రాజు ఎక్కువగా ఈవెంట్స్ లో కూడా ఆమెతోనే కనిపిస్తున్నారు.
భార్య తేజస్వినిని కూడా తన సినిమాల విషయంలో దిల్ రాజు భాగస్వామ్యం చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది.ప్రస్తుతం దిల్ రాజు దృష్టి మొత్తం వకీల్ సాబ్ మీద ఉంది.
వకీల్ సాబ్ తర్వాత ఎఫ్ 3సినిమా మీద ఫోకస్ పెడుతున్నారు.ఇదిలా ఉంటే ఇప్పుడు దిల్ రాజు తన భార్యని కూడా చిత్ర పరిశ్రమలోకి తీసుకొచ్చే పనిలో ఉన్నారు.
తన సినిమా కథల విషయంలో ఆమెని భాగం చేయడంతో పాటు ఆమెకి కీలక బాధ్యతలు అప్పగించే పనిలో ఉన్నారని తెలుస్తుంది.దిల్ రాజు పెద్ద సినిమాలతో పాటు వెబ్ మూవీస్ కూడా నిర్మించడానికి సిద్ధం అవుతున్నాడు.
అందులో భాగంగా ముందుగా తన భార్య రీసెంట్ గా చెప్పిన ఒక స్టోరీ లైన్ బాగా నచ్చి దానితోనే మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం.వెబ్ మూవీకి సరిపోయే ఒక కథని తేజస్విని దిల్ రాజుకి చెప్పడంతో అతను వెంటనే తన రైటింగ్ టీంకి ఆ కథని డెవలప్ చేసే బాధ్యతలు అప్పగించారని తెలుస్తుంది.
ఇక ఈ కథతోనే వెబ్ సినిమాని తెరకెక్కించి, ఆపై వెబ్ మూవీస్ కి సంబంధించి కథల బాధ్యతని ఆమెకి అప్పగించడంతో పాటు ఆమెని రచయితగా పరిచయం చేయడానికి దిల్ రాజు సిద్ధమవుతున్నారని తెలుస్తుంది.మరి దీనికి సంబంధించి త్వరలో ఏదైనా అఫీషియల్ కన్ఫర్మేషన్ ఉంటుందేమో చూడాలి.