రాజకీయాల్లో కి వచ్చిన తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక సినిమాలకు గుడ్ బై చెబుతారు అని అందరూ భావించారు.అయితే అనూహ్యంగా ఆయన వరుసగా సినిమాలు చేస్తుండడం తో పవన్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎప్పుడెప్పుడు అది రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలోనే దిల్ రాజు నిర్మాతగా బాలీవుడ్ మూవీ పింక్ చిత్రం రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే.అయితే పవన్ చాలా గ్యాప్ తరువాత చేస్తున్న సినిమా కావడం తో అభిమానులు అందరూ కూడా భారీ అంచనాలతో ఉన్నారు.
అయితే ఈ చిత్రం షూటింగ్ కు సంబంధించి కొన్ని ఫోటోలు,వీడియో లు లీక్ అవుతుండడం తో నిర్మాత దిల్ రాజు పరేషాన్ అవుతున్నారు.ఇప్పటికే ఈ చిత్రం కు సంబంధించి కొన్ని ఫోటోలు లీక్ కావడం తో పవన్ సీరియస్ అయ్యి దిల్ రాజు కు క్లాస్ కూడా పీకినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్.
అయితే ఇప్పుడు తాజాగా ఒక వీడియో కూడా లీక్ అవ్వడం తో దిల్ రాజు ఇక అలాంటి మిస్టేక్ జరగకుండా చూసుకోవడానికి చివరికి కోర్టు కు కూడా వెళ్లినట్లు తెలుస్తుంది.తన సినిమా గురించి ఎవరైనా సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు పోస్ట్ చేసినా.
ఫోటోలు కానీ వీడియోలు కానీ షేర్ చేసినా కూడా న్యాయపరంగా చర్యలు తప్పవని పిటిషన్లో దిల్ రాజు పేర్కొన్నట్లు తెలుస్తుంది.తన సినిమా గురించి ఎవరు కూడా ఇలా అడ్డగోలుగా ఫోటోలు వీడియోలు పోస్ట్ చేయకూడదంటూ సీరియస్ అయ్యాడు.
అలాంటి వాళ్లకు ఏడాది వరకు జైలు శిక్షతో పాటు 5 వేల రూపాయల జరిమానా కూడా విధించనున్నట్లు తెలుస్తుంది.వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నివేదా థామస్తో పాటు మరో ముగ్గురు హీరోయిన్లు కనిపిస్తున్నారు.మే 15న సినిమా విడుదల కానున్న ఈ చిత్రానికి వకీల్ సాబ్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు