గుణశేఖర్ ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో శాకుంతలం సినిమాని తెరకెక్కించడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.భారీ బడ్జెట్ తో మైథలాజికల్ కాన్సెప్ట్ తో లవ్ డ్రామాగా ఈ సినిమాని గుణశేఖర్ ఆవిష్కరించబోతున్నాడు.
ఇక ఈ సినిమాలో టైటిల్ రోల్ కోసం స్టార్ హీరోయిన్ సమంతని అధికారికంగా కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే.సమంత ఇందులో శకుంతల పాత్రలో కనిపిస్తుందని టాక్ రావడంతో సినిమాకి మరింత బూస్టింగ్ వచ్చింది.
ఇక దుశ్యంతుడుగా ఎవరు నటిస్తారనే దానిపై గుణ టీం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.అయితే ఈ పాత్ర కోసం ఒక స్టార్ హీరోని కన్ఫర్మ్ చేసే పనిలో ఉన్నారని తెలుస్తుంది.
శాకుంతలం స్టోరీ నేరేషన్ అంతా టైటిల్ రోల్ శకుంతల పాత్ర నుంచి జరుగుతూ ఉండటంతో దుశ్యంతుడు పాత్రకి తక్కువ ప్రాధాన్యత ఉంటుంది.అయినా కథలో అతనే నాయకుడు కాబట్టి కచ్చితంగా ఎవరిని ఎంపిక చేసిన వారికి ప్లస్ అవుతుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో సమంత భాగస్వామ్యం కావడానికి దిల్ రాజు కారణమని తెలుస్తుంది.
దిల్ రాజు కూడా శాకుంతలం సినిమాకి భాగస్వామి అయినట్లు తెలుస్తుంది.గుణశేఖర్ తో కలిసి దిల్ రాజు ఈ సినిమాని నిర్మించడానికి రెడీ అయినట్లు టాక్.ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా నిర్మాతగా బాలీవుడ్ లో కూడా తన ఎంట్రీని గ్రాండ్ గా ఉండే విధంగా దిల్ రాజు ప్లాన్ చేసుకుంటున్నాడు.
ఈ నేపధ్యంలో శాకుంతలం టైటిల్ రోల్ కోసం సమంతని తీసుకుందామని దిల్ రాజు చెప్పడం, అలాగే సమంత కూడా లైన్ లోకి వచ్చి కథ వినడం జరిగిందని, ఆమెకి నచ్చడంతో వెంటనే ఒకే చెప్పినట్లు తెలుస్తుంది.ఇక దిల్ రాజు నిర్మాణ భాగస్వామిగా చేరినట్లు త్వరలో మరో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని బోగట్టా.