విక్రమ్, మేజర్ సినిమాలు జూన్ లో విడుదల అయ్యి భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి.ఆ రెండు సినిమాలు కూడా సాధించిన వసూళ్ల గురించి ఎంత చెప్పినా తక్కువే.
తెలుగు లో కూడా విక్రమ్ మంచి వసూళ్లు నమోదు చేసింది.మేజర్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది.
అప్పటి నుండి అంటే దాదాపుగా రెండు నెలలుగా ఎలాంటి సందడి బాక్సాఫీస్ వద్ద లేదు.ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతూనే ఉంది.
ఎట్టకేలకు మొన్న విడుదల అయిన సీతారామం మరియు బింబిసార సినిమా లు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి.ఈ రెండు సినిమా లు సక్సెస్ అయ్యి మంచి వసూళ్లు రాబట్టిన నేపథ్యం లో ఇక నుండి రాబోతున్న సినిమా లన్నీ కూడా బాక్సాఫీస్ ను షేక్ చేస్తాయి అన్నట్లుగా ఇటీవల ఒక కార్యక్రమం లో దిల్ రాజు మాట్లాడటం చర్చనీయాంశం గా మారింది.
కేవలం దిల్ రాజు మాత్రమే కాకుండా చాలా మంది కూడా బింబిసార సినిమా రేంజ్ లోనే ఇక నుండి వచ్చే సినిమా లు ఉంటాయి అంటున్నారు.టాలీవుడ్ కు మంచి రోజులు వచ్చాయి అంటున్నారు.
ఈ రెండు సినిమా లతో టాలీవుడ్ కు మంచి రోజులు ఎలా వస్తాయి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.హీరోలు మంచి సబ్జెక్ట్ లు ఎంపిక చేసుకుని సక్సెస్ అయితే ఏమో కాని ఇలా ఒక సినిమా సక్సెస్ అయ్యి.
ఆ తర్వాత వచ్చే సినిమా లు సక్సెస్ అవుతాయని ఎలా అనుకుంటారు అంటూ కొందరు దిల్ రాజును ప్రశ్నిస్తున్నారు.వచ్చే వారం లో కార్తికేయ 2 మరియు మాచర్ల సినిమాలు రాబోతున్నాయి.
ఆ రెండు సినిమా లు కంటెంట్ బాగుంటేనే తప్ప ప్రేక్షకులు థియేటర్లకు రావడం అసాధ్యం.అలాంటిది ఈ సినిమా ల వల్ల వాటికి కూడా మంచి రోజులు వచ్చాయి అంటే ఎలా అనేది కొందరి అనుమానం.