సౌత్ ఇండియా స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక పాన్ ఇండియా సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.దిల్ రాజు ఏకంగా రెండు వందల కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.
ప్రస్తుతం ఇండియన్ 2 వివాదం కారణంగా ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి ఆలస్యం అవుతుంది.లేదంటే ఇప్పటికే ఓపెనింగ్ కూడా జరిగిపోయేది.
ఇండియన్ 2 వివాదం పరిష్కారం అయితే జులైలో ఈ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.ఇక ఇందులో హీరోయిన్ గా కియరా అద్వానీని ఫైనల్ చేసే పనిలో ఉన్నారని తెలుస్తుంది.
అలాగే పూజా హెగ్డే, రష్మిక పేర్లు కూడా వినిపిస్తున్నాయి.ఇదిలా ఉంటే ఇందులో రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడనే ప్రచారం జరుగుతుంది.
ఇక తాజాగా సినిమా గురించి మరో అప్డేట్ వినిపిస్తుంది.కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ని సినిమాలో ప్రతినాయక పాత్ర కోసం ఎంపిక చేయాలని శంకర్, దిల్ రాజు నిర్ణయించుకున్నట్లు టాక్ వినిపిస్తుంది.
ఇప్పటికే సుదీప్ ఈగ, సైరా సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకి చేరువ అయ్యాడు.అలాగే దబాంగ్ 3 తో బాలీవుడ్ లో విలన్ గా మెరిశాడు.తమిళంలో కూడా సుదీప్ కి ఇమేజ్ భాగానే ఉంది.ఇండియన్ వైడ్ ఇమేజ్ ఉన్న నటులలో సుదీప్ కూడా ఉండటంతో అతను విలన్ గా చేస్తే రామ్ చరణ్ కి సరిజోడీగా ఉంటుందని దిల్ రాజు భావించి అతన్ని సంప్రదిస్తున్నట్లు తెలుస్తుంది.
దిల్ రాజు నిర్మాణంలో శంకర్ లాంటి దర్శకుడి సినిమా అంటే తనకు కూడా మైలేజ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి సుదీప్ కూడా ఒప్పుకునే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది.