టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్రాజు.ఈయన సినిమాలు అంటే డిస్ట్రిబ్యూటర్లు ఎగబడి మరీ కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తారు.
ఈయన నిర్మించిన సినిమాలకు మార్కెట్లో మంచి క్రేజ్ ఉంటుంది.ఈయన సినిమా కథల పట్ల మంచి జడ్జ్మెంట్ ఉంటుందని అంతా అంటూ ఉంటారు.
ఈయన చిన్న పెద్ద అనే తేడాలు లేకుండా సినిమాలు నిర్మిస్తే డిస్ట్రిబ్యూటర్లు భారీ మొత్తాలకు సినిమాలను దక్కించుకునేందుకు ముందుకు వస్తుంటారు.కాని ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది.
దిల్రాజు నిర్మాణంలో వాసు వర్మ దర్శకత్వంలో సునీల్ హీరోగా తెరకెక్కిన ‘కృష్ణాష్టమి’ చిత్రం బిజినెస్ అవ్వడం లేదు.
‘జోష్’ వంటి ఫ్లాప్ చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన వాసు వర్మ చాలా కాలం తర్వాత తెరకెక్కించిన చిత్రం ఇదే.అలాగే సునీల్ సైతం వరుస ఫ్లాప్లతో ఉన్నాడు.ఇలాంటి సమయంలో వీరిద్దరి కాంబినేషన్లో మూవీకి పెద్దగా క్రేజ్ రాలేదు.
దానికి తోడు దిల్రాజు ఈ చిత్రాన్ని భారీ మొత్తానికి అమ్మేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.దాంతో ఈ చిత్రంపై నమ్మకం లేక పోవడంతో కొనేందుకు డిస్ట్రిబ్యూటర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
అందుకే ఇప్పటికే విడుదల అవ్వాల్సింది ఈ చిత్రం వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది.జనవరి చివర్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.
మరి అప్పుడు అయినా బిజినెస్ అవుతుందో చూడాలి.దిల్రాజు వంటి ప్రముఖ నిర్మాత నిర్మించిన ఈ చిత్రానికి ఇలాంటి సమస్య రావడం అంతా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.