సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ సంక్రాంతి బరిలో నువ్వా నేనా అనే రీతిలో పోటీ పడుతున్నారు.ఇప్పటికే వీరు నటించిన సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో సినిమాలు సంక్రాంతి కానుకగా రిలీజ్కు రెడీ అయ్యాయి.
ఈ సినిమాల్లో ఏది విజయం సాధిస్తుందో, ఏదీ సూపర్ సక్సెస్ అవుతుందో, ఏది యావరేజ్ మూవీగా నిలుస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.అయితే ఈ రెండు సినిమాలు ఓ వ్యక్తికి నిద్ర లేకుండా చేస్తున్నాయి.
ఆయనే స్టార్ ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు.సరిలేరు నీకెవ్వరు చిత్రానికి ఆయన ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాకు ఉన్న భారీ క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు.అయితే బన్నీ నటిస్తున్న అల వైకుంఠపురములో సినిమా కూడా సంక్రాంతికే రిలీజ్ కానుండటంతో ఈ సినిమాకు కూడా థియేటర్లు పెద్ద సంఖ్యలో కావాల్సి ఉంది.
కాగా ఈ సినిమాను దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు.
దీంతో ఇప్పుడు ఏ సినిమాకు థియేటర్లు ఎక్కువ ఇవ్వాలా అనే డైలామాలో పడ్డాడు దిల్ రాజు.
సరిలేరు నీకెవ్వరు సినిమాకు ఎక్కువ థియేటర్లు ఇస్తే, అల వైకుంఠపురములో బయ్యర్లు కూడా తమకు ఎక్కవ థియేటర్లు కావాలని డిమాండ్ చేస్తు్న్నారు.దీంతో దిల్ రాజు తలపట్టుకున్నట్లు తెలుస్తోంది.