నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వి’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపాలని నాని ప్రయత్నిస్తున్నాడు.
కాగా ఈ సినిమాను పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.కాగా ఈ సినిమాలో నాని చేయబోయే పాత్రపై ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఈ సినిమాలో నాని విలన్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.కాగా ఈ సినిమాలో నాని పాత్ర చాలా వైవిధ్యంగా ఉండబోతున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి.ప్రస్తుతం నెలకొన్ని లాక్డౌన్ కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది.అయితే ఈ సినిమాను నేరుగా ఓటీటీ ప్లాట్ఫాంలపై రిలీజ్ చేయాలని చిత్ర నిర్మాత దిల్ రాజుకు భారీ మొత్తంలో ఆఫర్ ఇచ్చారు.వి చిత్రం కోసం ఆయనకు ఏకంగా రూ.30 కోట్ల మేర ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.కానీ ఆ ఆఫర్ను దిల్ రాజు రిజెక్ట్ చేశారట.కాగా తాజాగా ఆయనే స్వయంగా ఓటీటీ ప్లాట్ఫాంలకు ఓ అదిరిపోయే క్రేజీ ఆఫర్ ఇచ్చారట.
ఈ సినిమాకు సంబంధించిన ఫస్టాఫ్ రైట్స్ను మాత్రమే ఓటీటీలకు ఇస్తానని, సెకండాఫ్ను థియేటర్స్ యాజమాన్యాలకు ఇస్తానని ఆయన తెలిపారట.ఫస్టాఫ్ చూసిన ప్రేక్షకులు సెకండాఫ్ చూసేందుకు థియేటర్స్కు వస్తారని, తద్వారా ఇరు వర్గాలకు న్యాయం చేకూరుతుందని దిల్ రాజు అన్నారట.
అయితే ఇలా చేయడం కుదరకపోవచ్చని పలువురు కామెంట్ చేస్తున్నారు.మొత్తానికి వి చిత్రం కోసం ఓటీటీల మధ్య పోటీ చాలా తీవ్రంగా ఉందనే మాట మాత్రం వాస్తవం అని చెప్పాలి.