టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు రీసెంట్ గా రెండో పెళ్లి చేసుకున్నాడు.తనకంటే వయసులో 20 ఏళ్ళు చిన్న అయిన అమ్మాయిని దిల్ రాజు పెళ్లి చేసుకొని తన జీవితంలోకి తెచ్చుకున్నాడు.
కరోనా టైంలో అతి కొద్ది మంది కుటుంబ సభ్యుల మధ్య అతని రెండో వివాహం జరిగింది. తేజశ్విని అనే అమ్మాయిని అతను పెళ్లి చేసుకున్నాడు.
ఇక పెళ్లి తర్వాత దిల్ రాజు ఒకప్పటిలా కాకుండా తన డైలీ రొటీన్ లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి.ఎక్కువగా ఫిట్ నెస్ మీద శ్రద్ధ పెట్టాడు.
అలాగే లాక్ డౌన్ కారణంగా ఎలాగూ సినిమా షూటింగ్ లు లేవు కాబట్టి ఎక్కువ సమయం భార్యతోనే గడుపుతున్నాడు.ఆమెతో కలిసి ఆలయాలకి వెళ్తున్నారు.
ఇక తాజాగా రెండో భార్యతో ఆఫ్టర్ వెడ్డింగ్ ఫోటో షూట్ ఒకటి తీసుకున్నారు.
ఈ ఫోటో షూట్ కి సంబందించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు ఆసక్తికరమైన కామెంట్స్ చేస్తున్నారు.అసలే దిల్ రాజు చాలా యంగ్ గా ఉంటారు.ఇప్పుడు పెళ్లి తర్వాత మరింత యంగ్ గా మారిపోయి కుర్రాళ్ళకి పోటీ ఇచ్చేలా ఉన్నారు అని కామెంట్ చేస్తున్నారు.అదే సమయంలో కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
అలాగే దిల్ రాజు రెండో పెళ్లి తర్వాత పూర్తిగా మారిపోయారని, వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించారని చెప్పుకుంటున్నారు.ఇదే సమయంలో వకీల్ సాబ్ రిలీజ్ ఎప్పుడు చేస్తారంటూ నెటిజన్లు అతనిని అడుగుతున్నారు.
మొత్తానికి దిల్ రాజు వెడ్డింగ్ మూమెంట్స్ కరోనా కారణంగా సినిమాలు లేకపోవడంతో భాగా ఆశ్వాదిస్తున్నారు అని మాత్రం అర్ధమవుతుంది.