మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్ గెలవాలని కంప్యూటర్ బాబా ఒక మైదానంలో పూజలు నిర్వహిస్తున్నారు.అయితే ఈ పూజల నిర్వహణకు ముందు ర్యాలీ గా మైదానంలోకి అడుగుపెట్టారు.
ఈ క్రమంలో పోలీసులు కాషాయం వస్త్రం మెడలో ధరించి మరీ సెక్యూరిటీ డ్యూటీ చేశారు.ఎందుకంటే ఎక్కడ ఏమైనా అల్లరులు జరిగినా ఈజీ గా జనం మధ్యలో నుంచే అంతా కంట్రోల్ చేయొచ్చని.
అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్ గెలుపు కోసం ఈ బాబా పూజలు నిర్వహిస్తుండడం పై ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించింది.
బీజేపీ పార్టీ ఈసీ కి ఫిర్యాదు చేయడం తో ఈసీ పై మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.భోపాల్ లో దిగ్విజయ్ కు పోటీ గా బీజేపీ నుంచి సాధ్వి ప్రజ్ఞా సింగ్ తలపడుతున్నారు.అయితే విచిత్రం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ ర్యాలీ లో కాంగ్రెస్ జెండాల కంటే కూడా బాబా గారి కాషాయ జెండాలే ఎక్కువగా ఎగిరాయట.
ఒకపక్క పోలీసుల మెడల్లో కూడా కాషాయ వస్త్రం ఉండడం,మరోపక్క ర్యాలీ సమయంలో బాబాగారి కాషాయ జెండాలే ఎక్కువగా కనపడడం తో కాంగ్రెస్ అధిష్టానం కూడా గుర్రు మంటున్నట్లు సమాచారం.