దేశంలో బ్రష్టు పట్టిన రాజకీయ వ్యవస్థలో నాయకుల తీరు దేశ సమగ్రతకి జాతి సమైక్యతకి భగం కలిగించే విధంగా దేశం కోసం ప్రాణాలకి తెగించి పోరాడుతున్న మిలటరీని అవమానించే విధంగా ఈ మధ్యకాలంలో ఉంటున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఎంత సేపు రాజకీయ నాయకులు వారి స్వార్ధపూరిత ప్రయోజనాలని ద్రుష్టిలో పెట్టుకొని వివాదాస్పద వాఖ్యలు చేస్తూ వుంటారు.
వాటి ప్రభావం ఇతరుల మీద ఎలా ఉంటుందో అనే విషయాన్ని ఎ మాత్రం గ్రహించరు అనే విషయాన్ని ఇప్పటికే మమతా బెనర్జీ, చంద్రబాబు లాంటి నాయకులు చేసి చూపించారు.
ఇదిలా వుంటే తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పోరాటాన్ని కించ పరిచే విధంగా వాఖ్యలు చేసారు.
పుల్వామా దాడి తర్వాత భారత్ వాయుసేన పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో సర్జికల్ స్ట్రైక్ చేసిన సంగతి తెలిసిందే.ఇప్పుడు ఈ సర్జికల్ స్ట్రైక్ అనేది జరగలేదని, జరిగితే వాటికి ఆధారాలు చూపించాలని దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేయడం విశేషం.
ఇప్పటికే పుల్వామా దాడి కూడా ఉగ్రవాదులు చేసిన పని కాదని మోడీ తన రాజకీయ స్వలాభం కోసం చేసిన కుట్ర అని మమతాబెనర్జీ, చంద్రబాబు ఆరోపణలు చేసిన నేపధ్యంలో తాజాగా దిగ్విజయ్ వాఖ్యలు కూడా సంచలనంగా మారాయి.