మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వినయ విధేయ రామ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది.
ఈ సినిమాకు సంబంధించి బోయపాటి శ్రీను డైరెక్షన్ పై నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో ట్రోల్స్ వచ్చాయి.కొన్ని సన్నివేశాల విషయంలో బోయపాటి శ్రీను విమర్శలను ఎదుర్కొన్నారు.
అయితే ఈ సినిమా వల్ల చరణ్, బోయపాటి మధ్య దూరం పెరిగిందని తెలుస్తోంది.
వినయ విధేయ రామ సినిమా విడుదలైన తర్వాత రామ్ చరణ్ ఈ సినిమా ఫలితం గురించి స్పందిస్తూ బహిరంగ లేఖను విడుదల చేశారు.
మెగా అభిమానులను నిరాశపరిచినందుకు తనను క్షమించాలని రామ్ చరణ్ కోరారు.అయితే చరణ్ ఆ విధంగా లేఖను రిలీజ్ చేయడంతో అప్పట్లో బోయపాటి శ్రీను హర్ట్ అయ్యారని తెలుస్తోంది.
ఆ రీజన్ వల్లే తర్వాత రోజుల్లో బోయపాటి శ్రీను మెగా కాంపౌండ్ కు దూరంగా ఉన్నారని సమాచారం.
సాయిధరమ్ తేజ్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా గురించి వార్తలు వైరల్ అయినా ఆ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక ప్రకటన రాకపోవడానికి కారణమిదేనని తెలుస్తోంది.అయితే అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి మాత్రం బోయపాటి శ్రీను సుముఖంగా ఉన్నారని తెలుస్తోంది.బోయపాటి శ్రీను ప్రస్తుతం రామ్ తో ఒక సినిమా చేస్తున్నారు.
భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని బోగట్టా.
ఈ సినిమా రిలీజైన తర్వాతే కొత్త సినిమాలపై రామ్ దృష్టి పెట్టనున్నారని సమాచారం అందుతోంది.
బోయపాటి శ్రీను రెమ్యునరేషన్ సైతం భారీగా పెరిగిందని అఖండ సక్సెస్ తో బోయపాటి శ్రీను రెట్టింపు ఉత్సాహంతో ఈ సినిమాను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది.ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.