ఇండియాలో డీజిల్ రేట్లు మరీ దారుణంగా పెరిగి పోతున్నాయి.గత పదేళ్లలో పెట్రోల్, డీజిల్ రేట్లు దాదాపుగా 300 శాతం పెరిగింది.
రాబోయే రెండేళ్లలో పెట్రోల్ సెంచరీ కొట్టడం ఖాయం అంటున్నారు.మొన్నటి వరకు పెరిగిన తీరు చూస్తే 2020కి ముందే సెంచరీ అనుకున్నారు.
అయితే ఈ ఏడాది ఎన్నికలు ఉన్న కారణంగా కాస్త తక్కువగా పెంచుతున్నారు.ఆమద్య ఎన్నికల సమయంలో అయిదు రూపాయలను తగ్గించారు కూడా.
ప్రస్తుతం ఇండియాలో పెట్రోల్, డీజిల్ ప్రైజ్ పెరుగుదలను చూస్తుంటే సామాన్యుల వెన్నులో వణుకు పడుతుంది.
మారుతున్న జీవన విధానం మరియు వివిధ పరిస్థితుల కారణంగా పెట్రోల్, డీజిల్ తప్పనిసరిగా వాడాల్సిందే.డీజిల్ వాడకం తగ్గించే పరిస్థితి కనిపించడం లేదు.ఎంత చేసినా కూడా డీజిల్ ధర తగ్గించలేం అంటూ ప్రభుత్వాలు కూడా అంటున్నాయి.
ఇండియాలో డీజిల్ వాడకం రోజు రోజుకు పెరిగి పోతుంది.గతంలో పెట్రోల్ మరియు డీజిల్ రేట్ల మద్య వ్యత్యాసం ఎక్కువ ఉండేది.
కాని ఇప్పుడు రెండు కూడా చేరువకు అవుతున్నాయి.పెట్రోల్ ను డీజిల్ టచ్ చేసే అవకాశం కనిపిస్తుంది.
ఇండియాలో ప్రస్తుతం డీజిల్ 65 రూపాయలు ఉండి.కాని కొన్ని ప్రపంచ దేశాల్లో డీజిల్ కేవలం 5 రూపాయలు నుండి 10 రూపాయల్లోనే ఉంది.
ఆ దేశాల్లో డీజిల్ వినియోగం ఎక్కువగా లేకపోవడంతో పాటు, డీజిల్ నిల్వలు ఎక్కువగా ఉన్నాయి.అందుకే ఇంత తక్కువ రేటు అంటున్నారు.
ప్రపంచంలో డీజిల్ లీటరు 25 రూపాయల కంటే తక్కువ ఉన్న దేశాలు ఏంటో కింద చూడవచ్చు.
వెనుజుల : ఫ్రీ ఇరాన్ : రూ.5.05 సూడాన్ : రూ.6.12 సౌది : రూ.8.8 అల్గేరియా : రూ.13.7 ఈక్విడార్ : రూ.19 ఈజిప్ట్ : రూ.21.75 అజర్బైజాన్ : రూ.24.8 కువైట్ : రూ.27
.