కరోనా వైరస్.చైనాలోని వుహాన్ నగరంలో పుట్టి ప్రపంచ దేశాలను వణికిస్తున్న వైరస్ ఇది.అలాంటి ఈ వైరస్ గురించి మరో నిజం వెలుగులోకి వచ్చింది.చైనాలో చనిపోయిన కోడికి కరోనా పరీక్షా చెయ్యగా దానికి పాజిటివ్ అని తేలింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.బ్రెజిల్ నుంచి చికెన్ ని దిగుమతి చెయ్యగా కరోనా పరీక్షలు నిర్వహించారు.
అందులో చికెన్ కి కరోనా పాజిటివ్ అని తేలింది.
సాధారణంగానే మాంసపు మార్కెట్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తారు.
అలానే బ్రెజిల్ నుంచి దిగుమతి అయినా చికెన్ లో చెయ్యగా కరోనా పాజిటివ్ అని వెల్లడైంది.దీంతో అక్కడ చికెన్ కొని తీసుకువెళ్లిన వారందరికీ కరోనా పరీక్షా నిర్వహించగా నెగటివ్ అని ఫలితం వచ్చింది.
అయితే ఈ విషయంపై చైనాలోని బ్రెజిల్ ఎంబసీ నుంచి ఎటువంటి స్పందన లేదు.
కాగా చైనాలో కరోనా వైరస్ కేసులు పెరగడంతో అక్కడ అధికారులు అప్రమత్తం అయ్యారు.
మాంసం మార్కెట్ లో పని చేస్తున్న సిబ్బందికి, వ్యాపారులకు, వినియోగదారులకు నిరంతరం కరోనా పరీక్షలు చేస్తున్నారు.కేవలం చికెన్ లో మాత్రమే కాదు ఈక్వెడార్ నుంచి దిగుమతి చేసుకున్న సీఫుడ్ ప్యాకేజీల్లో కరోనా ఉన్నట్లు చైనా ప్రభుత్వం మరో ప్రకటనలో తెలిపింది.