కంగనా ఈ పేరు వింటేనే కాంట్రవర్సి కేరాఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు.బాలీవుడ్ సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న కంగనారనౌత్, ఎంతో ముక్కుసూటి మనిషి.
తను ఏ విషయం చెప్పడానికి ఏమాత్రం జంకకుండా,నిర్మొహమాటంగా మాట్లాడేస్తుంది.అందుకే కంగన బాలీవుడ్ కాంట్రవర్సి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది.
తనకు నచ్చిన విషయాన్ని ఏ మాత్రం భయపడకుండా సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని అందరితో పంచుకుంటుంది.
కంగనా కొన్నిసార్లు చేసే ట్వీట్స్ చాలామంది సెలబ్రిటీస్ కు వ్యతిరేకంగా ఉంటాయి.
ఆమె చేసే ట్వీట్స్ అందరూ నెటిజన్లకు నచ్చకపోవచ్చు.కానీ కంగనా మాత్రం ఎవరి అభిప్రాయాలను లెక్కచేయకుండా తను చెప్పాల్సింది సోషల్ మీడియా ద్వారా నిర్మొహమాటంగా చెప్పేస్తుంది.
ఈ నేపథ్యంలోనే కంగనా రనౌత్ పై నెటిజన్ తాజాగా స్పందిస్తూ కంగనా తన ట్విట్టర్ ఖాతాలో సైలెంట్ గా ఉంటే బాగుంటుంది అని సలహా ఇచ్చారు.దీనికి స్పందించిన కంగనా.
తన ట్విట్టర్ ఖాతాను ఫాలో అయ్యే అభిమానులకు తన ట్వీట్స్ నచ్చకపోయినా, బోర్ కొట్టిన తనని మ్యూట్ లో పెట్టుకోవచ్చు లేదా బ్లాక్ చేయొచ్చు, అంతే కాని తనని ఎవరూ ఆపలేరని అంటూ ఆ నెటిజన్ ట్వీట్ కు కంగనా తనదైన శైలిలో స్పందించారు.
కంగనా తాజాగా జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఈ విషయంలో స్పందిస్తూ జో బెడెన్ను గజినీ బెడెన్గా అభివర్ణిస్తూ ట్వీట్ చేశారు.
అయితే కంగనా మద్దతు వైస్ ప్రెసిడెంట్గా కమలా హ్యరీస్కు సపోర్ట్ చేస్తున్నట్లు తెలిపారు.ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి మర్చిపోయే జో బెడెన్ ఒక సంవత్సరం పాటు మరిచిపోకుండా ఉండేందుకు ఏవైనా మందులు ఇచ్చే ఉంటారని ఆమె సూచించారు.
వైస్ ప్రెసిడెంట్ గా కమల హ్యరీస్ ముందుకు వచ్చి ఎందరో ఆడవారికి స్ఫూర్తిదాయకంగా నిలిచారని ఆమె తన ట్వీట్ ద్వారా తెలియజేశారు.
ఇక సినిమాల విషయానికొస్తే కంగనా తనదైన శైలిలో నటించి ఎంతోమంది ప్రేక్షకులను సొంతం చేసుకున్నారు.
అయితే కంగనా తాజా సినిమా తేజస్ కోసం సిద్ధమవుతున్నారు.ఈ సినిమాలో కంగనా ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ పాత్రలో ఆమె నటించనున్నారు.