తెలుగులో ప్రముఖ దర్శకుడు రవిబాబు దర్శకత్వం వహించిన “మనసారా” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్న నటి శ్రీ దివ్య గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈమె తెలుగులో సినిమాల్లో నటించడం కంటే ముందు బుల్లితెర మీద కూడా ప్రేక్షకులని బాగానే అలరించింది.
ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి ఈ టీవీ ఛానల్ లో అప్పట్లో ప్రసారమయ్యే తూర్పు వెళ్ళే రైలు అనే ధారావాహికలో నటించింది.
అయితే ఈ సీరియల్ లో నటిస్తున్న సమయంలో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మారుతి దర్శకత్వం వహించిన బస్ స్టాప్ అనే చిత్రానికి ఆడిషన్ ఇచ్చింది.
దీంతో బస్ స్టాప్ చిత్రం కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకోవడంతో ఈ అమ్మడికి వరుసగా సినిమా అవకాశాలు తలుపు తట్టాయి.కాగా శ్రీదివ్య తమిళంలో విశాల్, కార్తి, శివ కార్తికేయన్, ఆర్య తదితర ప్రముఖ హీరోల చిత్రాలలో నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.
అయితే ఆ మధ్య కాలంలో ఈ అమ్మడు హోటల్ గదిలో వ్యభిచారం నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడిందని పలు వార్తలు వినిపించాయి.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం హీరోయిన్ శ్రీ దివ్య తమిళ ప్రముఖ దర్శకుడు బర్నేశ్ దర్శకత్వం వహిస్తున్న ఓతైక్కు ఓతై అనే తమిళ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ చిత్రంలో ఈ చిత్రంలో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకతవమ్ వహించిన గద్దల కొండ గణేష్ అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న తమిళ హీరో అధర్వ హీరోగా నటిస్తున్నాడు.ఇప్పటికే ఈ చిత్రానికి సంబందించిన పలు కీలక సన్నివేశాలు కూడా పూర్తయినట్లు సమాచారం.