టీడీపీ అధినేత చంద్రబాబు చీకటి పొత్తుల్లో ఆరితేరిపోయారు.ఆయన తన రాజకీయ స్వార్థం కోసం ఎన్నోసార్లు చీకటి పొత్తులకు తెరలేపారు.
బీజేపీతో పొత్తు పెట్టుకుని పొగిడింది బాబే.తర్వాత 2009లో బయటకు వచ్చి బీజేపీని తిట్టింది బాబే.
మళ్లీ అదే బీజేపీతో 2014లో పొత్తు పెట్టుకుని మోడీ, అమిత్ షాలను భుజాన మోసింది బాబే.అదే బీజేపీతో 2019లో పొత్తు పెటాకులు చేసుకుంది కూడా బాబే.
ఇక జనసేనతో 2014లో చెట్టా పట్టాలేసుకున్న బాబు 2019లో జనసేనను పక్కన పెట్టేశారు.రాజకీయంగా ఆయన తన అవసరాలను బట్టి ఎవరితో పొత్తు పెట్టుకుంటారో … ఆ అవసరాలు తీరాక వారిని సైడ్ చేసేస్తుంటారన్నది ఇప్పటికే చాలా సార్లు ఫ్రూవ్ అయ్యింది.
అంతెందుకు జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాక జరిగిన అనేక ఉప ఎన్నికల్లో జగన్ను దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చారు.పైగా తన పార్టీ అభ్యర్థులను నిలబెట్టి కూడా వారిని డమ్మీలను చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థలకు మద్దతు ఇచ్చేలా తెరవెనక కథ నడిపడంలో ఆయనకు ఆయనే సాటి.2012లో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీకి పట్టున్న రెండు మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ మద్దతు తీసుకున్న చంద్రబాబు… కాంగ్రెస్కు పట్టున్న 15 నియోజకవర్గాల్లో తమ పార్టీ నుంచి డమ్మీ అభ్యర్థులను నిలబెట్టి వైసీపీని ఓడించాలని విశ్వ ప్రయత్నాలు చేశారు.అయినా ఆ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది.
మొన్న పవన్ పోటీ చేసిన గాజువాక నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్లని పవన్.అక్కడ కార్యకర్తలకు పవన్ను గెలిపించాలని సందేశం ఇచ్చారు.ఇక ఇప్పుడు త్వరలోనే తిరుపతి పార్లమెంటు సీటుకు జరిగే ఉప ఎన్నికల్లోనూ చంద్రబాబు చీకటి పొత్తులకు తెరలేపుతోన్న పరిస్థితి ఉంది.తిరుపతిలో టీడీపీకి గెలిచే సీన్ ఎలాగూ లేదు.
బీజేపీ ప్రాపకం కోసం అర్రులు చాస్తోన్న బాబును ఆ పార్టీ వాళ్లు దగ్గరకు రానివ్వడం లేదు.దీంతో ఆ పార్టీ నుంచి డైరెక్టు సాయం తీసుకోకుండా ఇన్ డైరెక్టుగా సాయం తీసుకుంటున్నారు.
ఇప్పుడు అక్కడ టీడీపీ నిలబెట్టిన అభ్యర్థి పనబాక లక్ష్మి డమ్మీ… ఆమె గత ఎన్నికల్లోనే చిత్తుగా ఓడిపోయారు.లక్ష్మిని డమ్మీని చేసి తమ పార్టీ కేడర్కు బీజేపీ అభ్యర్థికి ఓట్లేయాలని సూచించే అవకాశాలున్నాయంటున్నారు.
రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేసి ఓట్లు చీలిస్తే వైసీపీ గెలుపు మరింత సులువు అవుతుంది.ఏదేమైనా తిరుపతి ఉప ఎన్నిక సాక్షిగా పనబాకను బాబు బలి చేయనున్నారన్న కామెంట్లు ఆ పార్టీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి.