తెలుగులో ప్రముఖ దర్శకుడు దేవాకట్ట దర్శకత్వం వహించిన “ప్రస్థానం” అనే చిత్రంలో నెగటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాత్రలో నటించి తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా పరిచయం అయినటువంటి యంగ్ హీరో సందీప్ కిషన్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
అయితే ఇటీవలే సందీప్ కిషన్ టాలీవుడ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడుతో కలిసి తన చిన్నప్పుడు తీసుకున్న ఫోటోలను తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
అలాగే ఈ ఫోటో ద్వారా చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ చోటా కె నాయుడు కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.దీంతో ప్రస్తుతం సందీప్ కిషన్ చిన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సందీప్ కిషన్ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు జీవన్ కనుకొలను దర్శకత్వం వహిస్తున్న ఏ వన్ ఎక్స్ ప్రెస్ అనే ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పలు చిత్రీకరణ పనులు కూడా పూర్తయినట్లు సమాచారం.
అలాగే తమిళ భాషలో కూడా నరగాసురన్ అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తున్నాడు.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కార్తీక్ నరేన్ దర్శకత్వం వహిస్తున్నాడు.