ఈ ఫోటోలో నిలబడి ఉన్న వ్యక్తి ఎవరో చెప్పుకోండి చూద్దాం...?

మాటలకి చింతకాయలు రాలుతాయా లేదో తెలియదు కానీ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలకి మాత్రం కచ్చితంగా హృదయాలు కదులుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.అందువల్లే ఇప్పటి వరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన  చిత్రాలలోని పవర్ ఫుల్ డైలాగులు చాలామంది సినీ అభిమానులు సమయ సందర్భాలను బట్టి వల్లి వేస్తుంటారు.

 Trivikram Srinivas, Tollywood Director, Athadu Movie, Memories,-TeluguStop.com

అయితే అప్పట్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన “అతడు” అనే చిత్రం గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా చెప్పనవసరం లేదు.అయితే ఈ చిత్ర షూటింగ్ సమయంలో హీరో మహేష్ బాబు మరియు కమెడియన్ సునీల్ లకు సన్నివేశాలను వివరిస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి.

అయితే ఈ చిత్రం విడుదలయి దాదాపుగా 15 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ ఈ చిత్రంలో క్లైమాక్స్ లో మహేష్ బాబు “అబద్ధం చెప్పాను.అబద్ధం మాత్రమే చెప్పాను… తేకానీ మోసం చేయాలనుకోకు లేదు” అంటూ చెప్పే డైలాగులు ఇప్పటికీ చాలామంది బాగానే గుర్తుంటాయి.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.కాగా ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేస్తున్నట్లు గతంలో అధికారిక ప్రకటన కూడా చేశారు.

ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా షూటింగులు  వాయిదా పడడంతో ఈ చిత్ర విడుదల కూడా వాయిదా పడుతుందా లేక శరవేగంగా షూటింగ్ నిర్వహించి అనుకున్న సమయానికి విడుదల చేస్తాడో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube