తెలుగు సినీ సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు రోజా గురించి తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమే.ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించి స్టార్ హోదా ను సంపాదించుకుంది.
వెండి తెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంది రోజా.ఇదిలా ఉంటే ఈమె గతంలో అప్పుల్లో కూరుకుపోయింది.
ఆ సమయంలో ఈమెను ఒకరు కాపాడారట.
ఈమె తొలిసారిగా ప్రేమ తమస్సు అనే సినిమాలో రాజేంద్ర ప్రసాద్ సరసన హీరోయిన్ గా నటించింది.
ఈ సినిమాతోనే ఇండస్ట్రీకి పరిచయం అయింది రోజా.ఆ తర్వాత సీతారత్నం గారి అబ్బాయి, బొబ్బిలి సింహం, ముఠామేస్త్రి, బిగ్ బాస్, శుభలగ్నం వంటి ఎన్నో సినిమాల్లో నటించగా ఈ సినిమాలతో తన పాత్రలతో మంచి సక్సెస్ అందుకుంది.
చాలా వరకు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, జగపతి బాబు వంటి స్టార్ హీరోల సరసన నటించింది.
కేవలము నటిగానే కాకుండా నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టింది.
ఇక ఈమె తమిళ సినిమాలలో కూడా నటించింది.తమిళ చిత్ర దర్శకుడు ఆర్ కె సెల్వమణి దర్శకత్వంలో చెంబరుతి అనే సినిమా ద్వారా తమిళంలో అడుగుపెట్టింది.
ఇక సెల్వమణిను ఇష్టపడి ఆయనను పెళ్లి చేసుకుంది.వీరికి ఒక కుమారుడు ఒక కూతురు కూడా ఉన్నారు.
ఇక ఈమె వయసు మీద పడ్డ కొద్ది సహాయ పాత్రలలో కూడా నటించింది.అందులో కొన్ని నెగటివ్ రోల్ లో కూడా చేసింది.
ఇక బుల్లితెరపై ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షోలో జడ్జిగా చేస్తుంది.
ఈ షో కంటే ముందు రచ్చబండ , రంగస్థలం, మోడ్రన్ మహా లక్ష్మి, రేస్ వంటి షోలలో చేసింది రోజా.ఇక ఒక నటిగానే కాకుండా రాజకీయ పరంగా కూడా బాగా యాక్టివ్ గా ఉంది.ప్రస్తుతం ఎమ్మెల్యే గా ఏపీఐఐసీ చైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వహిస్తుంది.
ఇటీవల ఏపీ లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా తన నగర నియోజకవర్గంలో విజయం సాధించి మునిసిపాలిటీ వారు సొంతం చేసుకుంది.
ఇదిలా ఉంటే గతంలో రోజా గతంలో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది.
దాంతో చాలావరకు అప్పులు కూడా చేసింది.తను నిర్మాతగా మారినప్పుడు తన భర్తతో చాలా సినిమాలు చేయించింది.
తన దగ్గరున్న డబ్బులు పెట్టుబడి పెట్టి మరి సినిమాలు చేయించింది రోజా.కానీ ఆ సినిమాలు చాలా వరకు హిట్ కాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అప్పట్లో రోజా హీరోయిన్ గా అవకాశాలు కూడా అందకోకపోవడంతో ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంది.
ఆ తర్వాత ఏమి చేయలేక రాజకీయం లోకి అడుగుపెట్టింది.మొదట తెలుగుదేశం పార్టీలో చేరిన రోజా ఆ తర్వాత వైసీపీ పార్టీలో చేరింది.అక్కడ గౌరవాన్ని సంపాదించుకుంది.
దాంతో ఆర్థిక పరంగా కూడా లాభాలు బాగానే అందుకుంది.అలా ఆ తర్వాత బుల్లితెరపై జబర్దస్త్ షో లలో కూడా అడుగు పెట్టి మరింత డబ్బు ను సంపాదించుకుంది.
తర్వాత అన్ని అప్పులు తీర్చుకుంది.దీంతో ఆమెను ఆర్థికంగా కష్టాల నుంచి బయటపడి కాపాడింది వైసీపీ పార్టీ అనే చెప్పాలి.