కరోనా వైరస్ కారణంగా ప్రతి ఒక్కరు ఫేస్ మాస్కు వేసుకొని బయటకు వస్తున్నారు.కరోనా వైరస్ ని ఎదుర్కోవాలంటే ఫేస్ మాస్కు, శానిటైజర్ తప్పనిసరి.
అందుకే అందరూ అన్ని జాగ్రత్తలు తీసుకొని బయటకు వస్తున్నారు.ఇంకా ఈ నేపథ్యంలోనే మరో నటి కూడా ఫేస్ మాస్కు వేసుకొనే బయటకు వచ్చింది.
ఇప్పటికే ప్రభాస్.రవితేజ ఫేస్ మాస్కుతో బయటకు రాగ ఇప్పడు మరో నటి కూడా ఫేస్ మాస్కుతో దర్శనం ఇచ్చింది.పైన ఫొటోలో కనిపిస్తుంది కదా ఆమె ఎవరో గుర్తు పట్టారా? ఇంకా గుర్తు పట్టలేదా? ఆమెనండి బాపు గారి బొమ్మ బొంగరాల్లాంటి కళ్లు అని పవన్ కళ్యాణ్ పాట పాడాడు కదా! ఇంకా గుర్తు రాలేదా? ఆమెనండి ప్రణీత.సిద్దార్ద్ బావ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ప్రణీత తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించింది.
మొదటి సినిమాతో స్టార్ హీరోయిన్ అవ్వకపోయినప్పటికి అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించి మంచి పేరు సొంతం చేసుకుంది.పాండవులు పాండవులు తుమ్మెద, రభస, డైనమైట్, బ్రహ్మోత్సవం, హలో గురు ప్రేమకోసమే, ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలలో నటించి టాలీవుడ్ లో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించింది.
అంతేకాదు కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో ఎంతోమంది కష్టాల్లో ఉన్న ప్రజలకు భోజనాలు పంపిణి చేసి తన మంచి మనసును చాటుకుంది.