తెలుగులో ప్రముఖ దర్శకుడు సంపత్ నంది దర్శకత్వం వహించిన “ఏమైంది ఈ వేళ” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయం అయినటువంటి హీరోయిన్ నిషా అగర్వాల్ గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియనివారుండరు.అయితే ఈ అమ్మడు వచ్చీ రావడంతోనే ఫర్వాలేదనిపించి వరుస అవకాశాలు దక్కించుకుంది.
దీంతో ఒకానొక సమయంలో నిషా అగర్వాల్ చేతినిండా ఆఫర్లతో బాగానే బిజీ బిజీ గా గడిపింది.
అయితే ఆ తర్వాత 2013వ సంవత్సరంలో ముంబైకి చెందిన ఓ ప్రముఖ వ్యాపార వేత్తని పెళ్లి చేసుకుంది.
పెళ్లి చేసుకున్న తర్వాత నిషా అగర్వాల్ సినిమాల్లో నటించడం పూర్తిగా మానేసింది.ప్రస్తుతం విశాఖ వాళ్ళకి ఒక కొడుకు కూడా ఉన్నాడు.దీంతో నిషా అగర్వాల్ ఒక పక్క తన కుటుంబ బాధ్యతలను చక్కబెడుతూ మరోపక్క తన భర్తకి వ్యాపార పనుల్లో సహాయం చేస్తోంది.అయితే ఈ మధ్య మలయాళ సినీ పరిశ్రమకు చెందినటువంటి ఓ దర్శకుడు సినిమా ఆఫర్ ఇచ్చినప్పటికీ తనకి సినిమాల్లో నటించే ఆసక్తి లేదని చెప్పినట్లు కొందరు చర్చించుకుంటున్నారు.
కాగా ప్రస్తుతం నిషా అగర్వాల్ తన భర్త పిల్లలతో కలిసి ముంబై నగరం లో నివాసముంటున్నట్లు సమాచారం.
నిషా అగర్వాల్ ప్రస్తుతం టాలీవుడ్ లో చందమామ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్ చెల్లెలని దాదాపుగా చాలా మందికి తెలుసు.
ఇక నిషా అగర్వాల్ సినీ జీవితం విషయానికొస్తే తెలుగులో నటించినటువంటి ఈమె హీరోయిన్ గా నటించిన టువంటి ఏమైంది ఈవేళ సుకుమారుడు, సోలో, సరదాగా అమ్మాయితో తదితర చిత్రాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకు న్నాయి.కాగా నిషా అగర్వాల్ తెలుగు, మలయాళం భాషలలో కలిపి దాదాపుగా ఆరు చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.