ప్రస్తుతం బుల్లితెరపై ఓ రేంజ్ లో దూసుకుపోతున్న సీరియల్ కార్తీకదీపం.ఈ సీరియల్ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు మంచి అభిమాన సీరియల్ గా మారింది.
ఇక ఇందులో నటించే నటీనటులు మాత్రం మంచి అభిమానం సొంతం చేసుకున్నారు.ముఖ్యంగా వంటలక్క, డాక్టర్ బాబు పాత్రలో నటిస్తున్న ప్రేమి విశ్వనాథ్, నిరుపమ్ పరిటాల లు మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.
ఇదిలా ఉంటే డాక్టర్ బాబు నటించిన ఓ సీరియల్ లో రాజమౌళి నటించిన సంగతి చాలా వరకు ఎవరికి తెలియక పోవచ్చు.
తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ రాజమౌళి గురించి అందరికీ తెలిసిందే.2001లో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈ సినిమా తర్వాత ఎన్నో సినిమాలలో దర్శకత్వం వహించి మంచి గుర్తింపు అందుకున్నాడు.
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర దర్శకులలో ఒకరిగా నిలిచాడు.
ఈయన కెరీర్ మొదట్లో బుల్లితెరపై కూడా దర్శకత్వం వహించాడు.
ఇదిలా ఉంటే ఈయన గతంలో ఓ పాపులర్ టీవీ సీరియల్ ఎపిసోడ్ లో డైరెక్ట్ చేస్తూ నటిస్తూ కనిపించాడు.ఇంతకీ ఆ సీరియల్ ఏదో కాదు.
ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న సీరియల్ చంద్రముఖి.ఈ సీరియల్ కు యాట సత్యనారాయణ దర్శకత్వం వహించాడు.
ఇందులో ప్రీతినిగమ్, నిరుపమ్, మంజుల, నవీన, చలపతి రాజు తదితరులు నటించారు.ఇక సీరియల్ తోనే డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ తొలిసారిగా నటుడిగా పరిచయం అయ్యాడు.
ఇక ఆ సమయంలో సినిమా డైరెక్టర్ లు బుల్లితెరపై పలు షోలలో, సీరియల్ లో కాసేపు తళుక్కుమనే వాళ్ళు.
దాంతో చంద్రముఖి సినిమాలో డైరెక్టర్ రాజమౌళి అతిథిగా దర్శనమిచ్చాడు.
నిజానికి ఆ సీరియల్ అప్పుడు మంచి క్రేజ్ అందుకోవడంతో డైరెక్టర్ రాజమౌళికి మరింత క్రేజ్ వస్తుందని భావించారు.ఇక గతంలో ఈ సీరియల్ దాదాపు 1500 ఎపిసోడ్ లను పూర్తి చేసుకోగా ఆ సమయంలో రాజమౌళి అందులో ఓ సన్నివేశంలో నటించాడు.
అంతేకాకుండా ఆ ఎపిసోడ్ కు ఆయననే దర్శకత్వం వహించాడు.ఇక ఈ విషయం గురించి రాజమౌళి మాట్లాడగా.బుల్లితెర అంటే తనకు ప్రత్యేకమైన అభిమానం అని ఎందుకంటే తను సినిమాల్లోకి రాకముందు తను కూడా శాంతినివాసం అనే సీరియల్ లో పని చేశాను అని తెలిపాడు.100 భాగాలు పూర్తి చేయడమే ఎంతో గొప్పగా అనుకునే వాళ్ళమని.
అలాంటిది చంద్రముఖి సీరియల్ ఇన్ని భాగాలు సాగుతుందని అనుకోలేదని తెలిపాడు.ఈ సీరియల్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిందని ఇంకా ఈ సీరియల్ మరిన్ని భాగాలు కొనసాగాలని ఆ సమయంలో కోరాడు.
అంతేకాకుండా ఆ ప్రత్యేక భాగంలో తనకు అవకాశం ఇస్తే తప్పకుండా నటిస్తానని తెలిపాడు.
ఇక తను మర్యాద సినిమా రూపొందించానని అంతేకాకుండా ప్రభాస్ సినిమాకు దర్శకత్వం వహిస్తానని అప్పట్లో తెలిపాడు రాజమౌళి.
ప్రస్తుతం ఈయన ఆర్ ఆర్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.అంతే కాకుండా ఈ సినిమా తర్వాత పలువురు స్టార్ హీరోల సినిమాలకు దర్శకత్వం వహించనున్నాడు.