సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా , షార్ట్ ఫిల్మ్ం యాక్టర్ గా వెండితెర ఎంట్రీతోనే స్టార్ డైరెక్టర్ సుకుమార్ నిర్మాతగా మారి తెరకెక్కించిన చిత్రంలో యాక్ట్ చేసి మెప్పించింది.అంతేకాదు ప్రేక్షకుల్ని అలరించేందుకు యూట్యూబర్ గా మారింది.
ఆమె ఎవరో కాదు పూజిత పొన్నాడ.! వైజాగ్లో జన్మించిన పూజిత తండ్రి ఉద్యోగ రిత్యా చెన్నైలోనే నివాసం ఉండేది.
కాలేజ్ స్టడీ ముగిసిన వెంటనే హైదరాబాద్ లోని ఓ కార్పొరేట్ కంపెనీలో సాఫ్ట్ వేర్ గా బంపర్ ఆఫర్ తగిలింది.దీంతో చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన పూజిత ఓ వైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు షార్ట్ ఫిల్మ్ లో యాక్ట్ చేసేది.
అదే సమయంలో పూజితకు సుకుమార్ డైరక్షన్ లో యాడ్ ఫిల్మ్ లో యాక్ట్ చేసే అవకాశం వచ్చింది.ఆ తరువాత వరుస షార్ట్ ఫిల్మ్ లలో యాక్ట్ చేసి ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది.
కేవలం రెండేళ్ల వ్యవధిలోని ఓ స్టార్ యాక్టర్ గా మారింది.దీంతో సుకుమారే నిర్మాతగా తెరకెక్కిన ‘దర్శకత్వం’ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది.‘దర్శకత్వం’ సినిమా తరువాత రంగస్థలం, కల్కీ ఇలా వరుస ఆఫర్లు దక్కించుకుంటుంది.
తన మొదటి షార్ట్ ఫిల్మ్ ఉప్మా తినేసింది తరువాత టీవీ, సినిమాలు, ఎంటర్ టైన్ మెంట్ షోలు, షార్ట్ ఫిల్మ్ం లు, సినిమాలతో బిజీగా మారిన ఈ అమ్మడు.
తనకు గతంలో వచ్చిన అవకాశాలన్నీ కేవలం సరదా తీర్చుకోవడం కోసమే యాక్ట్ చేసినట్లు చెప్పింది.ఇక సుకుమార్ డైరక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా చేసే సినిమాలో తనకు అవకాశం వస్తే రెండేళ్ల పాటు మరో మూవీలో యాక్ట్ చేయనని చెప్పింది.
పవన్ కల్యాణ్ సినిమా బద్రి, నాని కృష్ణార్జున యుద్ధం సినిమాలు తనకెంతో ఇష్టమని చెప్పిన పూజిత తాను, దేవీశ్రీ ప్రసాద్ పెళ్లిచేసుకోబోతున్నట్లు జరిగిన ప్రచారం అవాస్తవమని కొట్టిపారేసింది.దేవీశ్రీ ప్రసాద్ తో రంగస్థలం ఆడియో ఫంక్షన్ లో ఒక్కసారి మాత్రమే మాట్లాడినట్లు, రూమర్స్ అనేవి ఎంటర్టైన్మెంట్ కోసమే క్రియేట్ చేస్తారని, అందులో ఎలాంటి నిజాలు ఉండవని తెలిపింది ఈ రంగస్థలం ముద్దుగుమ్మ.
ఇక తనలో టాలెంట్ ను గుర్తించింది అభిమానులేనని.వారికి మరింత దగ్గరయ్యేందుకు సోషల్ మీడియాలో యాక్టీవ్ అవుతున్నట్లు చెప్పింది పూజిత పొన్నాడ.