టాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు జయంత్ సి పరాన్జీ అప్పట్లో దర్శకత్వం వహించిన “ప్రేమించుకుందాం రా.!” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమై తెలుగు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్ అంజలా జవేరి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.ఒకప్పుడు టాలీవుడ్ లో అంజలా జవేరి స్టార్ హీరోలయినటువంటి మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నందమూరి బాలకృష్ణ, కింగ్ నాగార్జున, తదితరుల సరసన నటించి కొంతకాలం పాటూ స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది.
కాగా అంజలా జవేరి యునైటెడ్ కింగ్డం లో పుట్టి పెరిగింది.
కానీ సినిమాల పరంగా బాలీవుడ్ మరియు టాలీవుడ్ లో అవకాశాలు రావడంతో ఇక్కడే సెటిల్ అయ్యింది.కాగా అంజలా జవేరి టాలీవుడ్ లో విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న “తరుణ్ అరోరా” ని పెళ్లి చేసుకుంది.
పెళ్లయిన అనంతరం అంజలా జవేరి సినిమాల్లో నటించడం పూర్తిగా మానేసింది.కానీ పెళ్లయిన దాదాపుగా ఆరు సంవత్సరాల గ్యాప్ తర్వాత 2012వ సంవత్సరంలో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన “లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్” అనే చిత్రంలో ఓ ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది.
దీంతో అందరూ అంజలా జవేరి తెలుగులోకి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిందనుకునే లోపే మళ్లీ ఉన్నట్లుండి సినిమాల్లో నటించడం మానేసింది. ఈ విషయం ఇలా ఉండగా అప్పట్లో అంజలా జవేరి హీరోయిన్ గా నటించిన ప్రేమించుకుందాం రా, చూడాలని ఉంది, సమరసింహా రెడ్డి, భలేవాడివి బాసు దేవీపుత్రుడు రావోయి చందమామ తదితర చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి.
కాగా అంజలా జవేరి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, తదితర భాషలలో కలిపి దాదాపుగా 20 కి పైగా చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.ప్రస్తుతం అంజలా జవేరి తన కుటుంబ సభ్యులతో కలిసి ముంబైలో నివాసం ఉంటున్నట్లు సమాచారం.