ఎవరో గుర్తుపట్టారా? ఇంకా లేదా? వారేనండి.నాగచైతన్య, సమంత.
ఇటీవల నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా మాల్దీవ్స్ కి వెళ్లిన సమంత, చైతు నిన్న హైదరాబాద్ కు చేరుకున్నారు.హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లోకి వచ్చిన సమంత నాగ చైతన్య ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అయితే గత వారం రోజుల క్రితం నాగ చైతన్య బర్త్ డే సందర్భంగా ఈ జంట మాల్దీవులకు వెళ్ళిన సంగతి మనకు తెలిసినదే.
మాల్దీవుల అందాలను వీక్షిస్తూ ఎంతో ఎంజాయ్ చేశారు.
తన భర్త నాగచైతన్య పుట్టిన రోజు వేడుకలను కూడా మాల్దీవులలోనే ఎంతో ఘనంగా సమంత నిర్వహించారు.లాక్ డౌన్ తరువాత ఇన్ని రోజులు షూటింగ్ లలో బిజీగా ఉన్న ఈ జంట సరదాగా మాల్దీవుల వెకేషన్ కు వెళ్లారు.
అక్కడ వారు ఎంజాయ్ చేస్తూ,ఈ వెకేషన్ కు సంబంధించిన ఫోటోలను సమంత సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులతో పంచుకున్నారు.అప్పుడు సమంత మాల్దీవులకు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గానే మారాయి.
వారం రోజులు వెకేషన్ ని పూర్తి చేసుకున్న ఈ జంట తిరిగి హైదరాబాద్ వచ్చారు.ప్రస్తుతం నాగచైతన్య చేతిలో మూడు సినిమాలు ఉండటంతో షూటింగ్ లలో బిజీ అయిపోయారు.ఇక సమంత సినిమాలు ఏమీ చేయకపోయినప్పటికీ వెబ్ సిరీస్ లో నటించడానికి సిద్ధంగా ఉన్నారు.అలాగే ఆహా యాప్ ద్వారా సామ్ జామ్ అనే టాక్ షో కి వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసినదే.
ఈ షో ద్వారా సినీ సెలబ్రిటీస్ వ్యక్తిగత విషయాలను సమంత అడిగి తెలుసుకుంటారు.ఇప్పటికే ఈ షో కి సంబంధించి కొన్ని ఎపిసోడ్ లు ప్రసారం అయ్యాయి.
ఈ వెకేషన్ ద్వారా రిఫ్రెష్ అయిన ఈ జంట తిరిగి ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు
.